జనసేన వైపు బాలినేని చూపు !?

జగన్ బంధువు .. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఏదో ఒకటి తేల్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి తరపు బంధువు కావడంతో ఆయనకు వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. మంత్రి పదవి నుంచి తొలగించారు . జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టకుండా చేశారు. జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి పెత్తనమే సాగుతోంది. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఏదో ఒకటి చేయాలన్న ఆలోచలో ఉన్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌లో ముఖ్య అనుచరులతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది.

రాజకీయంగా ఏం చేద్దామన్నదానిపైనే అనుచరులను పిలిపించుకుని మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన పవన్ కల్యాణ్ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనపై పవన్‌ పార్టీకి చెందిన ఓ టీవీ చానల్‌లో వచ్చిన కథనాల విషయంలో.. పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్చేసి మాట్లాడారు. వెంటనే బాలినేని కేసులను ఉపసంహరించుకున్నారు. తర్వాత వారి మధ్య బాండింగ్ కనిపిస్తోంది. చేనేత దినోత్సవం సందర్భంగా… చేనేత వస్త్రాలు ధరించాని పవన్ చాలెంజ్ చేస్తే బాలినేని ధరించి మరీ ఫోటో పెట్టి చూపించారు.

అయితే అంత మాత్రాన ఆయన జనసేనలోకి వెళ్తారని చెప్పలేం కానీ.. వైసీపీలో ప్రాధాన్యత కోసం ఆయన ఇలా చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆయన నమ్ముతున్నారని.. సొంత పార్టీలో ఇక ఆదరణ లభించదని ఆయన డిసైడయ్యారని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో బాలినేని వ్యవహారం మాత్రం అంత తేలికగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close