షర్మిల విమర్శల “గీత దాటుతున్నా” ఎవరూ పట్టించుకోవడం లేదు !

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిల మీడియా అటెన్షన్ కోసం ఇటీవలి కాలంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మాటలే ఎక్కువగా ఉంటున్నాయి. కేసీఆర్ ఉరేసుకోవాలంటూ చాలా సార్లు వ్యాఖ్యానించారు. అయితే మా కేసీఆర్‌నే అంత మాట అంటావా అంటూ ఒక్కరూ స్పందించలేదు. టైమ్ వేస్ట్ అనుకున్నారేమో కానీ.. షర్మిల మాత్రం ఆ ఘాటు విమర్శలు కంటిన్యూ చేస్తోంది. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ.. ఆయనపై విరుచుకుపడింది. గతంలో ఆయన మంగళవారం మరదలు అంటూ షర్మిలను కామెంట్ చేశారు. అప్పట్లోనే దుమారం రేగింది. నిరంజన్ రెడ్డి కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

అప్పట్లో షర్మిల కూడా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ అవే వ్యాఖ్యలను గుర్తు చేస్తూ స్త్రీలో చెల్లిని,త‌ల్లిని చూడ‌లేని సంస్కార హీనుడు మంత్రి నిరంజ‌న్ రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. అధికార మ‌దంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే చెప్పు దెబ్బలు పడుతయ్ అని హెచ్చరించారు. నిరంజన్ రెడ్డి ఎప్పుడో అన్న మాటలను.. మాటలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా గుర్తు చేసి మరీ నిరంజన్ రెడ్డిని చెప్పుతో కొడతానని షర్మిల హెచ్చరించడం మీడయా అటెన్షన్ కోసమేనని చెబుతున్నారు.

అయితే తెలంగాణ మీడియాలో ఆమెకు కనీస ప్రాధాన్యత కూడా లభించడం లేదు. ఆమ ఎన్నిమాటలన్నీ లైట్ తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు కూలీలతో కలిసి భోజనం చేస్తూ.. వారికి తనిపిస్తూ. తాను తింటున్న ఫోటోల్లాంటివాటిని మీడియాకు ఇస్తున్నారు.తమకు ఉన్న పరిమితమైన సోషల్ మీడియా బలంతో వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయోజనం మాత్రం ఉండటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close