మధుయాష్కీ సేఫ్ గేమ్ !

తెలంగాణ కాంగ్రెస్‌లో పదవులు తీసుకోవడానికి రెడీగా ఉంటారు కానీ బాధ్యతలకు మాత్రం సిద్ధంగా ఉండరని మరోసారి స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికే మునుగోడు ఉపఎన్నికను తీసుకొచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉంటారు. కానీ గెలవడానికి మాత్రం ఎవరూ ప్రయత్నించడం లేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే.. అర్జంట్‌గా ఓ కమిటీని ప్రకటించారు. ప్రచారం సహా మొత్తం ఆ కమిటీనే చూసుకుంటుందని ప్రకటించారు. ఆ కమిటీకి చైర్మన్‌గా మధుయాష్కీ గౌడ్‌ను ప్రకటించారు. ఇన్ని రోజుల తర్వాత హఠాత్తుగా మధు యాష్కీ బాధ్యతల నుంచి వైదొలిగారు.

తాను రాష్ట్ర స్థాయి నేతనని తనకు ఇలా నియోజకవర్గానికి పరిమితం చేయడం ఏమిటని ఆయన హైకమాండ్ వద్ద అసంతృప్తి వ్యక్తం చేయడం.. తాను పని చేయలేనని చెప్పడంతో .. రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ఆ బాధ్యతలిచ్చారు. మిగతా కమిటీ సభ్యులు యథావిధిగా ఉంటారు. గత నెల రోజులుగా కమిటీ చైర్మన్ గా ఉన్న మధు యాష్కీ.. కాంగ్రెస్ క్యాడర్‌ను కాపాడేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. అందరూ వెళ్లిపోతున్నా పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి పర్యటనలతో వస్తున్న భరోసాని నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నించలేదు. కానీ చివరికి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

మునుగోడులో ఓడిపోతే .. కమిటీ చైర్మన్‌గా ఆయనకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఈ విషయం తెలుసుకునే మధుయాష్కీ వైదొలిగారని అంటున్నారు. పదవుల కోసం రాహుల్ గాంధీ వద్ద ఉన్న పరిచయాలను వాడుకునే మధుయాష్కీ కాంగ్రెస్ కోసం మాత్రం ఎప్పుడూ పని చేసిన దాఖలాల్లేవని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైతేనే.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీలో సగం మందికిపైగా బీజేపీకి తరలించిన తర్వాత మధుయాష్కీ సైలెంటయ్యారు. ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ మీద నెట్టేయడానికి అవకాశం చిక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close