రైతుల పాదయాత్ర సెగ – వైసీపీ కొత్త ప్లాన్లు !

అమరావతి రైతుల పాదయాత్రకు పెద్ద ఎత్తున జన స్పందన వస్తూండటంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. అది టీడీపీ యాత్ర అని ఎంతగా ప్రచారం చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. పాదయత్ర ఎక్కువగా గ్రామాల గుండానే వెళ్తోంది. ప్రతీ గ్రామంలోనూ రైతులకు అక్కడి రైతులు ఘనస్వాగతం పలుకుతున్నారు. రైతుల పాదయాత్రకు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. పార్టీలు, ప్రజాసంఘాలు.. ఇలా అన్నీ రాజధానికి మద్దతు ప్రకటించాయి. దీంతో వైసీపీలో వణుకు ప్రారంభమయింది.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన విశాఖలోనూ రైతుల పాదయాత్రకు విశేషమైన మద్దతు లభిస్తే ఇక మూడు రాజధానులకు విలువ లేకుండా పోతుంది. అందుకే వైసీపీ సిద్ధాంతకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే నిద్రలేచారు. అన్ని జిల్లాల పార్టీ ల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మేధావులతో చర్చా కార్యక్రమాలు పెట్టాలని సూచించారు. రాజమండ్రి, కాకినాడల్లో పెట్టినట్లుగా పెట్టాలని సూచించారు. ఇప్పటికే విశాఖలో మంత్రి అమర్నాత్ రౌండ్ టేబుల్ భేటీ నిర్వహించారు. ఇలాంటివి నిర్వహించాలని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వారిని తీసుకొచ్చి మాట్లాడించాలని చెబుతున్నారు.

మరో వైపు రోజుకొక నేతలతో అమరావతి రైతుల పాదయాత్రకు హెచ్చరికలు జారీ చేయిస్తున్నాయి. పాదయాత్రపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టవద్దని అంటున్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోనే పాదయాత్రను అడ్డుకోవాలన్న ప్రణాళికలు వేస్తున్నట్లుగా ప్రకటనలు ఉంటున్నాయి. నిజానికి పాదయాత్రలో ఎక్కడా స్వల్ప ఉద్రిక్తతలు కూడా ఉండటం లేదు. గుడివాడలో మాత్రం పోలీసులు హడావుడి చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పుడు వైసీపీ నేతలు పాదయాత్రపై కుట్రలు చేయాలని ఆలోచిస్తున్నారని రైతులు అనుమానపడుతున్నారు.

అయితే పాలకపార్టీగా ఉండి.. పాదయాత్రను అడ్డుకుంటే ఏం జరుగుతుందో వైసీపీ పెద్దలకు తెలియనిదేం కాదు. ఏం జరిగినా హైకోర్టు అనుమతి ఉన్నందున పాదయాత్ర ఆగదు. కానీ చెడ్డపేరు వస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఇచ్చిన బెదిరింపులు ఉన్నాయి. అయితే ఇలాంటి బెదిరింపుల తర్వాత కూడా పాదయాత్ర సాఫీగాసాగితే వారి వాదన తేలిపోతుంది. అందుకే వైసీపీ కొత్త ప్లాన్లేస్తుంది. వారి బ్రెయిన్ ఎలా ఉంటుదో అంచనా వేయడం కష్టం కాబట్టి … ఆ ప్లాన్లు ఏమిటనేది జరిగిన తర్వాతే తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సాయంత్రం కుండపోతే… హైదరాబాద్ కు బిగ్ అలర్ట్..!!

గురువారం కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ ఇంకా తేరుకోనేలేదు.. అప్పుడే మరో బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది....

ఏపీ అట్టుడుకుతుంటే విదేశీ పర్యటనా..?

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా, ఏపీ సీఎం జగన్ వైఖరి కూడా అదే తరహాలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు హింసాత్మక ఘటనలతో రాష్ట్రం భగ్గుమంటుంటే వాటిపై దృష్టి...

భూ వివాదం.. ఎన్టీఆర్ క్లారిటీ

ఎన్టీఆర్ సొంత ఇంటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ భూమి కొని మోస‌పోయాడ‌ని, ఈ కేసు విష‌యంలో హైకోర్టు వ‌ర‌కూ వెళ్లాడ‌న్న‌ది స‌ద‌రు వార్త సారాంశం....

పారితోషికాన్ని మూడు రెట్లు పెంచేసిన హీరో

'డీజే టిల్లు'తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ కెరీర్ మొత్తం మారిపోయింది. ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చేశాడు. 'టిల్లు స్క్వేర్‌' కూడా హిట్ట‌వ్వ‌డంతో ఇప్పుడు సిద్దు డేట్లు హాట్ కేకుల్లా మారిపోయాయి. సిద్దుతో సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close