మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏకంగా 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో మోహరించబోతున్నారు. ఇంచార్జ్లుగా నియమితులైన వారంతా దసరా తర్వాత తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించింది ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో గ్రామాలకు వెళ్లాలని.. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

ఇప్పటి వరకూ మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కసరత్తులో హరీష్ రావు పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు.కానీ ఇప్పుడు ఆయనకే బాధ్యతలిచ్చినట్లుగా తెలుస్తోంది. తొలి సారిగా మునుగోడుపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షకు హరీష్ రావుకు పిలుపు అందింది. ఆయన కూడా హాజరయ్యారు. మునుగోడులో అంత తేలిక కాదని అర్థం కావడంతో ఉపఎన్నికల బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీష్‌రావుకు అప్పగించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు.

ఇటీవల దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యతలు హరీష్ కే ఇచ్చారు. అయితే నాగార్జున సాగర్, హుజూర్ నగర్ వంటి ఎన్నికల బాధ్యతలు ఆయనకు ఇవ్వలేదు. యాధృచ్చికంగా హరీష్ బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు సవాల్ లాంటి నియోజకవర్గంలో కూడా హరీష్‌కే బాధ్యతలిస్తున్నారు. తేడా వస్తే హరీష్‌కు మరోసారి టీఆర్ఎస్‌లో కష్టకాలం వస్తుందన్న గుసగుసలుకూడా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ జాతీయ పార్టీ రాజకీయాల కోణంలో ఇప్పుడీ వ్యవహారం గుసగుసలకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close