బైజూస్‌ కోసం టీచర్లపై ప్రభుత్వం దండయాత్ర !

బైజూస్ కంటెంట్‌ను ఎలాగైనా విద్యార్థులకు అంటగట్టాలని గట్టి ప్రయత్నంతో ఉన్న ప్రభుత్వం టీచర్లను వేధించడానికి కూడా వెనుకాడటం లేదు. జైజూస్ ఇస్తామన్న ట్యాబ్‌లు ఇవ్వలేదు. నెలలకు నెలలు గడిచిపోతున్నాయి. కానీ పిల్లల స్మార్ట్ ఫోన్లలోనే బైజూస్‌ను డౌన్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఎక్కడ నుంచి వస్తాయన్న కనీస ఆలోచన చేయలేదు. వారి తల్లిదం‌డ్రుల ఫోన్లలో అయినా డౌన్ లోడ్ చేయాల్సిందేనని ఆదేశాలిచ్చింది. ఈ బాధ్యత టీచర్లకు ఇచ్చింది.

కానీ ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారంతా.. స్మార్ట్ ఫోన్లు వాడతారన్న గ్యారంటీ లేదు. ఫోన్ ఉన్నా డేటా ఉంటుందన్న గ్యారంటీలేదు. ఇలాంటి పరిస్థితుల కారణంగా విద్యార్థుల ఫోన్ నెంబర్లను టీచర్లు రిజిస్టర్ చేయలేకపోయారు. ఇదే అదనుగా.. టీచర్లందరిపై ప్రభుత్వం దండయాత్ర ప్రారంభించింది. బైజూస్ యాప్ డౌన్ లోడ్ కోసం.. ఫోన్ నెంబర్లు సేకరించలేదన్న కారణంగా వందల మంది టీచర్లకు నోటీసులు జారీ చేసింది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోకుండా ఇలా టీచర్లపై ప్రతీ దానికి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేయడం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.

ప్రభుత్వం రూ. ఐదు వందల కోట్లకుపైగా బైజూస్‌కు కట్టాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం ట్యాబ్‌లు వస్తాయని ప్రకటించారు. మొదట అమ్మఒడికి బదులు ల్యాప్ ట్యాప్ ఇస్తామన్నారు.. తర్వాత అదీ లేదు. తర్వాత ఉచితంగా బైజూస్ ట్యాబ్ అన్నారు. ఇప్పుడు ఇంకా దారుణంగా విద్యార్థుల సొంత ఫోన్లలోనే బైజూస్ ఉండాలంటున్నారు. ట్యాబ్‌ల గురించి మాట్లాడటం లేదు. అసలు టీచర్లు ఎప్పటిలాగే పాఠాలు చెబుతూంటే.. బైజూస్ కంటెంట్ ఎందుకని వస్తున్న ప్రశ్నలకూ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close