మోదీతో ఆ భేటీకి కూడా కేసీఆర్ వెళ్లడం కష్టమే !

డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం ఉంది. జీ 20 దేశాల కూటమికి ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తోంది. ప్రధాని మోదీ ఈ నాయకత్వాన్ని .. ప్రపంచంలో భారత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేలా చేయాలనుకుంటున్నారు. అందు కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్‌కూ కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి.. ఆహ్వానించారు. అయితే మోదీతో సమావేశం అంటే.. కేసీఆర్ ఇటీవలి కాలంలో పూర్తి స్థాయిలో దూరం పాటిస్తున్నారు. ఈ సమావేశానికీ వెళ్లరని భావించవచ్చు. అయితే ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి వెళ్లే అవకాశం ఉండొచ్చంటున్నారు.

నిజానికి కేసీఆర్ ఢిల్లీ టూర్ కు వెళ్లాల్సి ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన వెంటనే.. వివిధ రాష్ట్రాల ఇంచార్జులను ప్రకటించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలపై ఓ స్పష్టత వచ్చింది. రైతు సంఘాల నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో చిన్న పార్టీలతో కలిసి నడుస్తారు. అయితే ఇలాంటి వారందరితో కేసీఆర్ ఢిల్లీలో చర్చలు జరపాల్సి ఉంది. ఇందు కోసం ఆయన ఢిల్లీ వెళతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది.

డిసెంబర్ ఏడో తేదీ లోపున తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మారే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ గురించి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో ప్రకటించాలనుకోవడం లేదు. అది జాతీయ స్థాయిలోనే ఉండాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటి వరకూ బీఆర్ఎస్ గురించి కేసీఆర్ బయట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేశ ప్రజలందరి ముందే తన ఆలోచనలు.. జెండా, అజెండా ప్రకటించాలనుకుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇతరులతో చర్చలు జరపలేకపోతున్నారు. అందర్నీ సమన్వయం చేసుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close