వైసీపీ నీడ పడితేనే భయపడిపోతున్న ఏపీ పార్టీలు !

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మిత్రపక్షం అన్న పార్టీనే లేదు. ఆ పార్టీతో పెట్టుకోవడం కన్నా సైలెంట్ గా ఉండటమే మంచిదని రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. వైసీపీ కూడా అంతే. కొంత మంది నాయకులకు తాయిలాలిచ్చి.. అప్పుడప్పుడూ పొగిడించుకుంటే చాలనుకుంటున్నారు. నేతలు..మేధావుల పేరుతో కొంత మంది పదవులు.. పనులు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు. కానీ రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకం. వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఓ వైపు ఉన్నా.. కలిసి మెలిసి లేవు. ఏ పార్టీ దారిన ఆ పార్టీ వెళ్తున్నాయి.

ఏపీలో ఉన్న విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ వ్యతిరేకమే. వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై పోరాడాలని చంద్రబాబు అనుకుంటున్నారు. జనసేనను తీసుకు వచ్చారు. కానీ బీజేపీ , కాంగ్రెస్ రావడం కష్టం. ఎందుకంటే బీజేపీ పైకి విమర్శలు చేస్తున్నా… ప్రో వైసీపీ అనే ముద్ర ఉంది. తాము కరిగిపోయినా జగన్ ను నిలబెట్టాలన్నట్లుగా వారి తీరు ఉంటోంది. వామపక్షాలు పవన్, చంద్రబాబుతో కలిసేందుకు సిద్ధంగానే ఉంటాయి.

ఏపీలో అందరి చూపు బీజేపీ వైపు ఉంది. ఆ పార్టీ గేమ్ ఛేంజర్ కాకపోవచ్చు కానీ.. చాలా వరకూ పరిస్థితుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ సపోర్ట్ అవసరం అని భావిస్తున్నారు. బీజేపీ కూడా జనసేన పార్టీ చీఫ్.. టీడీపీ అధినేత కలిసి మాట్లాడుకోవడంపై బీజేపీ చాలా నార్మల్‌గా స్పందించింది. అది పొత్తుల మ్యాటర్ కాదని లైట్ తీసుకుంది. తాము జనసేనకు అండగా ఉంటామని చెబుతూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని నెగెటివ్ వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదు. మొత్తంగా వైసీపీకి అందరూ వ్యతిరేకమే. వైసీనీ నీడ పడినా నష్టపోతామని భయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close