జగన్ దూకుడు – బడ్జెట్ తర్వాతే అసెంబ్లీ రద్దు చేస్తారా ?

ఏపీ సీఎం జగన్ దూకుడు చూస్తూంటే మార్చి తర్వాత బడ్జెట్ పెట్టి… అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త అప్పులకు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఏప్రిల్‌లో అసెంబ్లీ రద్దు చేస్తే.. నాలుగు నెలల కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నాలుగు నెలల కాలంలో.. అరవై వేల కోట్ల అప్పులు చేసి.. ప్రజలకు విచ్చలవిడిగా పంచేసి… ఎన్నికలకు వెళ్తే.. బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారు. ఆ తర్వాత గెలిస్తే పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అడిగేవారుండరు. అడిగితే.. రెండో సారి గెలిచిన పవర్‌తో పోలీసుల్ని పంపి.. మూసేయవచ్చు. అదే మరో ఏడాది పాలన అంటే.. అప్పులు పుట్టడం గగనం అవుతుంది.

మరోసారి గెలవాలంటే తప్పకుండా ముందస్తు ఎన్నికలు వెళ్లాలని ప్రశాంత్ కిషోర్ టీం సలహా ఇచ్చిందని చెబుతున్నారు. ముందస్తు సంకేతాలివ్వాలని మంత్రులకు కూడా హైకమాండ్ సందేశం ఇచ్చింది. అందుకే అప్పల్రాజు ఎప్పుడైనా ఎన్నికలంటూ కొత్త రాగం అందుకున్నారు. పై స్థాయి నుంచి సంకేతాలు లేకపోతే అప్పల్రాజు అలా మాట్లాడరు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కూడా పీకే టీమ్‌ సర్వే పూర్తి చేసింది. ఇటీవల జగన్ రేయింబవళ్లు కసరత్తు చేసి అభ్యర్థిని ఫైనల్ చేశారని చెబుతున్నారు. దాని ప్రకారమే ఇంచార్జుల్ని.. ఇతరుల్ని మారుస్తున్నారు.

టీడీపీ, జనసేన మధ్య పొత్తు అంటూ ఏర్పడితే.. అది ఉత్తరాంత్ర నుంచి నెల్లూరు వరకూ ప్రభావం చూపిస్తుందని.. రాయలసీమలోనూ లెక్కలు మారుతాయన్న అంచనాలు ఇప్పటికే వచ్చాయి. అందుకే జనసేన టీడీపీతో వెళ్లకుండా చేయాల్సినంత చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయితే.. జరిగే నష్టం అపారం.. అందుకే… వీలైనంత వరకూ ఆ పార్టీల మధ్య సఖ్యత పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close