వింటేజ్ చిరంజీవిని మిస్ చేసుకున్న దేవిశ్రీ

స్వరం గొప్పదా ? సాహిత్యం గొప్పదా ?… రెండూ గొప్పవే. సాహిత్యం నుండే సంగీతం పుడుతుందని సంగీతకారుడు.. సంగీతమే సాహిత్యానికి స్ఫూర్తని సాహిత్యకారుడు పరస్పరం గౌరవించుకుంటారు. నిజం కూడా అదే. ఈ రెండిటిలో ఏది బాగాలేకపోయినా పాట నిలబడదు. ఒక మంచి ట్యూన్ చేసిన తర్వాత దీనికి మరింత మంచి సాహిత్యం వుండాలని సంగీత దర్శకుడు ఆశపడతాడు. అయితే మారిన పరిస్థితుల ప్రభావం ఏమిటో కానీ.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వరుస మాత్రం దీనికి భిన్నంగా వుంది. దేవిశ్రీ సంగీతంలో తయారౌతున్న ‘వాల్తేరు వీరయ్య ‘ఆల్బమ్ ఇందుకు నిదర్శనం.

ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ పాట విని అందరూ షాక్ అయ్యారు. చిరంజీవి పాట అంటే ద్రుష్టి అంతా చిరంజీవి పై వుంటుంది. కానీ బాస్ పార్టీ పాట మాత్రం వెరైటీ. అందరూ దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ గురించి చాలా వెటకారంగా మాట్లాడారు. దారుణంగా ట్రోల్ చేశారు. కారణం.,.దేవిశ్రీ రాసిన లిరిక్స్ అలా వున్నాయి. పదాలు ట్యూన్ లో సరిగ్గా కూర్చోలేదు. పాటంతా అతుకుల బొంతలా తయారైయింది.

ఇప్పుడు రెండో పాట ‘నువ్వు శ్రీదేవి.. నేను చిరంజీవి’ వచ్చింది. ఈ పాట చూసిన తర్వాత వీరయ్య ఆల్బమ్ ని మేకర్స్ లైట్ తీసుకున్నారా ? అనిపిస్తోంది. ట్యూన్ , బీట్ బావున్నాయి. దేవిశ్రీ పాత పాటలని గుర్తు చేసిన్సప్పటికీ .. ఓకే అనిపించింది. లొకేషన్ కూడా అదిరిపోయింది. అయితే ఈ ట్యూన్ కి లిరిక్స్ కి లొకేషన్ కి సింక్ కుదరలేదు. లిరిక్స్ లో ఎక్కడా నవ్యత లేదు. ‘వావ్’ అనుకునే ఎక్స్ ప్రెషన్ లేదు.

ఈ పాట కోసం యూరప్ వెళ్లి పూర్తిగా మంచుతో కప్పపడిన లొకేషన్ తో షూట్ చేశారు. తీరా ట్యూన్, లిరిక్స్ వింటే.. ”ఈ పాట కోసం అంతదూరం ఎందుకు.. ఏ స్టూడియో లోనో నాలుగు కలర్ ఫుల్ లైట్లతో లాగించేయోచ్చు’ కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. లిరిక్స్, ట్యూన్ విడివిడిగా వినిపిస్తున్నాయి. ట్యూన్ లో పదాలు ఫిట్ చేయడానికి దేవిశ్రీకున్న పద సంపద సరిపోలేదని క్లియర్ గా అర్ధమౌతుంది. తొలి పాట ఐటెం నెంబర్ .. దేవిశ్రీతో సరదా రాయించేశారని అనుకున్నారంతా. కానీ రెండో పాట దేవిశ్రీ తోనే రాయించడం చూస్తుంటే.. తెలుగులో లిరిక్ రైటర్స్ కి అంత కొరత వచ్చేసిందా ? అనిపిస్తోంది.

మెలోడికి డ్యాన్స్ చేయడం చిరంజీవి ట్రెండ్ సెట్టర్. వీణ పలికించిన గమకాలని సైతం తన బాడీ లాంగ్వేజ్ తో పట్టుకొని ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోలేని సిగ్నేచర్ స్టెప్స్ తో అలరించిన గొప్ప డ్యాన్సర్. ఈ పాటలో ఆ లొకేషన్ చూస్తే.. చిలుకా క్షేమమా,, హిమసీమల్లో, సిగ్గుతో చి చి.. లాంటి వింటేజ్ మెలోడితో ఆకట్టుకునే అవకాశం లభించింది. కానీ దేవిశ్రీ మాత్రం.. ‘రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు’ అంటూ తన రొటీన్ బీట్ తో సరిపెట్టేశాడు. వీరయ్యలో వింటేజ్ చిరంజీవిని చూపించాలనేది దర్శకుడు బాబీ ప్రయత్నం. ఈ యూరప్ లొకేషన్ లో చిరంజీవి వింటేజ్ మెలోడిని చూపించే అవకాశం వచ్చింది. కానీ ఈ ఛాన్స్ ని చేతులారా మిస్ చేసుకుంది వీరయ్య టీమ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close