ఏపీని చంద్రబాబు మాత్రమే కాపాడగలరంటున్న వైసీపీ రెడ్డి నేత !

వైసీపీ నేతల్లో మార్పు వస్తోంది. మీరు రెడ్డే.. నే్ను రెడ్డే అనే ఈక్వెషన్‌తో పార్టీలో చేర్చుకున్న డీఎల్ రవీంద్రారెడ్డి రివర్స్ అయ్యారు. వైసీపీకి ఈ సారి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. గత ఎన్నికలకు ముందు తన ఇంటికి ప్రత్యేక దూతల్ని పంపించి మరీ పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పటికీ తాను వైసీపీలోనే ఉన్నానని ప్రకటించారు. వైసీపీ వాళ్లేమీ తనను తీసేయలేదని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని ఆయన మండిపడ్డారు. పరిపాలన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారు.. ఆ పార్టీలో నేను ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నార.ు గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్ల ోఎవరూ కాపాడలేరని.. ఒక్క చంద్రబాబు మాత్రమే కాపాడగలరన్నారు. పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేం కానీ ఆయనకు అనుభం లేదని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఏవర్గం ప్రజలు సంతృప్తికరంగా లేరని అన్నారు. దోచుకోవడమే తప్ప జగన్ కు ఈ నాలుగేళ్లలో రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు.

వైఎస్ వినేకానందరెడ్డి హత్య కేసులో జనవరి 3 నుంచి కీలక మలుపులు ఉంటాయని డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించిందన్నారు. జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయని.. సుప్రీం తీర్పు తర్వాత వివేకా కేసులో జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. చాలామంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉందన్నారు. వివేకా కేసులో ఒంటరిగా పోరాడుతున్న ఆయన కుమార్తె సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చని డీఎల్ వ్యాఖ్యానించారు పార్టీలో చేర్చుకుని కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో డీఎల్ రవీంద్ర పైర్ అవుతున్నారు. అయితే చంద్రబాబును పొడిగినా టీడీపీలో చేర్చుకునే పరిస్థితులు కనిపించడం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close