తెలంగాణ గడ్డపై నుంచే కేసీఆర్‌కు బీఎల్ సంతోష్ హెచ్చరిక !

తప్పుడు ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు అనుభవించాల్సిందేనని కేసీఆర్‌కు బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ విస్తారక్‌లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన తన ప్రసంగంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును పరోక్షంగా ప్రస్తావించారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని.. వీటికి ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. తన పేరు తెలంగాణలో ఒక్కరికీ తెలియదని..కానీ ఫామ్ హౌస్ కేసు పేరుతో తప్పుడు ఆరోపణలు చేసి అందరికీ తెలిసేలా చేశారన్నరు. తనపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వమే సమధానం చెప్పాలన్నారు.

బీఎల్ సంతోష్ హెచ్చరికను బీఆర్ఎస్ తేలికగా తీసుకోలేదు. కేసీఆర్ కూడా తేలికగా తీసుకోలేరు. ఎందుకంటే.. బీజేపీలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో బీఎల్ సంతోష్ ఒకరు. ఆయన పూర్తిగా పార్టీ కోసమే పని చేస్తూంటారు. ఆయనను నేరుగా కేసీఆర్ టార్గెట్ చేశారు. సిట్ ద్వారా నోటీసులు జారీ చేయించి.. అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పెద్దలకూ ఆగ్రహం తెప్పించిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఫామ్ హౌస్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది.. వెంటనే హైకోర్టు ద్వారా కేసు సీబీఐకి వెళ్లింది. అంటే ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉన్న ఆయుధం సీబీఐకి వెళ్లింది.

ఇప్పుడు సీబీఐ ఈ కేసును ఎలాంటి మలుపులు తిప్పాలనుకున్నా తిప్పుగలుగుతుందన్న విషయం రాజకీయవర్గాలకు తెలుసు. ఈ క్రమంలో బీఎల్ సంతోష్ చేసిన హెచ్చరికలుు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క ఫామ్ హౌస్ కేసే కాదు.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు రోహిత్ రెడ్డి ఆస్తుల వ్యవహారాలు కూడా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు మరింతగా చిక్కులు పెరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close