ఏఎన్ఆర్ పై బాలయ్య అనుచిత వ్యాఖ్య, సోషల్ మీడియాలో రచ్చ

వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో భాగంగా బాలకృష్ణ పరోక్షంగా అక్కినేని నాగేశ్వరరావు పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు కారణం అవుతున్నాయి. ఇవి బాలకృష్ణ స్థాయికి తగినవి కావు అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

వీరసింహారెడ్డి విజయోత్సవం లో భాగంగా బాలకృష్ణ దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ ఇస్తున్న సమయం లో ఆర్టిస్టులు టెక్నీషియన్లు నిర్మాత దర్శకులతో పాటు అతిధులుగా వచ్చిన ఇతర హీరోలు దర్శకులు సైతం వేదిక పైన ఉన్నారు. అయితే బాలకృష్ణ ఈ స్పీచ్ ఇస్తున్నంత సేపు కూడా ఒక టాపిక్ నుండి మరొక టాపిక్ కి జంప్ అవుతూ, అనేక అసందర్భ విషయాలను కూడా ప్రస్తావిస్తూ తన స్పీచ్ కొనసాగించారు. గతంలో నటి శారద ని ఎన్టీఆర్ గారు ఎలా ప్రోత్సహించింది, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కాపు సామాజిక వర్గం వారు తమ నియోజకవర్గంలో ప్రతిష్టించింది, వంటి సినిమాకు సంబంధం లేని అనేక విషయాలను బాలకృష్ణ ప్రస్తావించి వేదిక పైన ఉన్న వారికే కాకుండా చూస్తున్న ప్రేక్షకులకు సైతం నీరసం తెప్పించారు. అయితే ఆర్టిస్టులను టెక్నీషియన్లను అందరినీ అభినందించిన తర్వాత నిర్మాతలను, కొందరు నటులను అభినందించే సమయం లో, ” అందరూ అద్భుతంగా నటించారు, వీరితో నాకు చక్కని టైంపాస్, శాస్త్రాలు, నాన్న గారి డైలాగులు , ఆ రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం” అంటూ వ్యాఖ్యానించారు.

పాతకాలం నటులను, ఆ డైలాగులను నెమరు వేసుకొనే సంగతి మంచిదే అయినప్పటికీ, అక్కినేని తొక్కినేని అంటూ తేలిగ్గా మాట్లాడడం అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం మింగుడు పడలేదు. ఇటీవల అన్ స్టాపబుల్ కార్యక్రమం వల్ల ఎంతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న బాలకృష్ణ మళ్లీ పాత తరహా లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులకు సైతం నచ్చలేదు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చ కు కారణమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close