పవన్‌కు మద్దతుగా లోకేష్ – క్లియర్ చేస్తున్నారా ?

కుప్పం బహిరంగసభలో లోకేష్ చాలా విషయాలు మాట్లాడారు. రాజకీయంగా కొన్ని విమర్శలకు గీత దాటకుండా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంలో పాదయాత్రకు అనుమతులు.. ఇతర అంశాలపై మాట్లాడినప్పుడు .. పవన్ వారాహి యాత్ర గురించి కూడా చెప్పారు. అడ్డుకుంటే తొక్కుకుంటూ వస్తామన్నారు. ఈ అంశం అటు టీడీపీ అటు జనసేన నేతల్లోనూ చర్చనీయాంశమయింది. జనసేనతో పొత్తు విషయం తేలకుండా ఇలా మద్దతుగా మాట్లాడటం మంచిది కాదేమోనని టీడీపీ నేతలు కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన నేతలు… పవన్ కల్యాణ్ ను రుద్దుతున్నారని అనుకుంటున్నారు.

నిజానికి టీడీపీకి పవన్ కల్యాణ్ దూరం జరిగినప్పుడు… లోకేష్ నే టార్గెట్ చేసుకున్నారు. లోకేష్ పై అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. శేఖర్ రెడ్డి అనే చెన్నై వ్యాపారిని లోకేష్ బినామీగా పవన్ విమర్శించారు. తర్వాత ఎలా అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరూ అనుకుంటున్నారని కవర్ చేశారు. ఇలా అధారాలు లేకుండా పవన్ . లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాదు.. శ్రీరెడ్డి అనే మహిళామణి … పవన్ పై చేసిన తిట్ల దండం లోకేష్ చేయించారని కూడా పవన్ ఆరోపించారు. నిజానికి అదంతా వైసీపీ ట్రాప్ అని తర్వాత తేలింది.

తనపై ఇన్ని నిందలేసినా పవన్ ను లోకేష్ ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత కూడా టార్గెట్ చేయలేదు. ఇప్పుడు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇప్పడు లోకేష్ మద్దతుగా మాట్లాడుతున్న అంశం గుర్తుకు వస్తే పవన్ అప్పట్లో తాను చేసిన ఆరోపణలు కూడా గుర్తుకు వస్తాయి. అయితే తానేమీ మనుసులో పెట్టుకోలేదని.. రాజకీయ ఆరోపణలుగానే చూస్తున్నానని.. కలిసి పని చేయడానికి సిద్ధమని.. లోకేష్… ఈ వారాహికి మద్దతు ద్వారా.. పవన్ కు సంకేతం పంపారని అనుకోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close