100 కి.మీ నడకలో తానేంటో ట్రైలర్ చూపించిన లోకేష్ !

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వంద కిలోమీటర్లు దాటింది.. ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకోవడానికి ఆయన ప్రారంభింంచిన పాదయాత్ర భారీ జన సందోహం మధ్య సాగుతోంది. మాట్లాడకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా ఆయన మాత్రం దూకుడుగానే ఉన్నారు. ఎక్కడ సందర్భం వచ్చినా బాధితులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. తనలో ఉన్న విజన్ నూ సందర్భాన్ని బట్టి ఆవిష్కరించారు.

ఓ సమావేశంలో నాలుగేళ్లు ఇంజినీరింగ్ చేసినా … మూడు నెలల అమీర్ పేట కోర్సు కోసం స్టూడెంట్స్ పరుగెడుతున్నారు. ఎందుకిలా ? ఆ అమీర్ పేట కోర్సులు కాలేజీల్లో ఎందుకు నేర్పకూడదు ? . తాము వస్తే అదే పని చేస్తామని ప్రకటించారు. అంటే లోకేష్ కు ఆ క్లారిటీ ఉంది. టీడీపీ రాగానే చేసి చూపిస్తానన్నారు. ఈ మాటలు విన్న తర్వాత భవిష్యత్ కోరుకునే యువత లోకేష్‌లో ఉన్న విజన్‌ను అభినందించకుండా ఉంటుందా ? ఓ స్కూల్ పిట్టగోడ నుంచి పిల్లలతో మాట్లాడుతూ… టీచర్లను ఎలా గౌరవించాలో చెప్పడం చూసిన వారికి… చదువు, .సంస్కారం నేర్పే రాజకీయనాయుకడ్ని చూశామని అనిపిస్తుంది. పార్టీ అంటే ప్రాణం ఇచ్చే సీనియర్ కార్యకర్త పాదాలకు నమస్కరించి… పార్టీ నీది నాది కాదు.. అందరిదీ అని అనిపించగలిగారు.

వందో కిలోమీటర్ పూర్తయిన తర్వాత గుర్తుగా శిలాఫలకం వేసుకోవడం ఇప్పటి వరకూ చూశాం. కానీ సొంత డబ్బుతో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం శిలాఫలకం వేయడం అందరిలోనూ లోకేష్ ఆలోచనా శైలిపై కొత్త ఆలోచనలు రేకెత్తించేలా చేసింది. అదే సమయంమలో ప్రభుత్వంపై పంచ్‌లకు లెక్కలేదు. పెంచుకుంటూ పోతానన్నాడక్కా.. మనమే అర్థం చేసుకోలేకపోయామని… జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టినా… పథకాల పేరుతో చేస్తున్న మోసాలని పవర్ ఫుల్‌గా ప్రజల ముందు పెట్టినా…. రాజకీయ విమర్శలకు .. ఎక్కడా గీత దాటకుండా రిప్లయ్ ఇచ్చిన అది లోకేష్ స్టైల్ అని ప్రజల్లో వందల రోజుల ముద్ర పడింది

లోకేష్ అంటే… వైసీపీ సోషల్ మీడియా వందల కోట్లు ఖర్చు చేసి.. మార్ఫింగ్‌లు చేసి చేసిన ఫేక్ ప్రచారంలో ఉన్న లోకేష్ కాదని..అసలైన లోకేష్ వేరు అని యువనేత ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. ఇప్పటికి ముగిసింది వంద కిలోమీటర్లే.. అంటే ట్రైలరే అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close