బీజేపీలో చేరిన వాళ్లందరిపై కేసులేమయ్యాయో చెప్పాలంటున్న కేటీఆర్ !

దేశంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ పక్షాలపై కక్ష తీర్చుకోడానికి … అవినీతి పరులైన నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని విపక్షాలు చాలా కాలంగా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. తర్వాత కవితను అరెస్ట్ చేయడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. దీంతో.. బీజేపీ తీరుపై బీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించింది. సిసోడియా అరెస్ట్ ను.. కేసీఆర్ కూడా ఖండించారు. కవితకు నోటీసులు ఇచ్చినప్పుడు స్పందించని కేసీఆర్ ఇప్పుడు ఎలా స్పందించారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అయితే కేటీఆర్ మాత్రం బీజేపీపై మరో డిఫరెంట్ ఎటాక్ ప్రారంభించారు. ప్రశాంత్‌ భూషణ్‌.. ‘ఈక్వాలిటీ బిఫోర్‌ లా..?’ అనే పేరుతో బీజేపీలో చేరిన తర్వాత పునీతులైన వారి పేర్లను సోషల్ మీడియాలో పోస్ట్ ేశారు. వారంతా బీజేపీలో చేరక ముందు తీవ్ర కేసులు ఎదుర్కొన్న వారు. బీజేపీలో చేరిన తర్వాత వారిపై విచారణలు ఆగిపోయాయి. నారాయ‌ణ్ రాణే 300 కోట్ల మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఇరుకుంటే ఆయ‌న బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.. వెంట‌నే దానిపై విచార‌ణ నిలిచిపోయింది.. నార‌ద స్కామ్ లో చిక్కుకున్న పశ్చిమబెంగాల్ నేత సువేంధు అధికారి క‌మలంలో చేరిన వెంట‌నే ఆ కేసు ఎటో వెళ్లిపోయిందన్నారు. లంచం కేసులో చిక్కుకున్న అసోం నేత హిమాంత భిశ్వ‌శ‌ర్మ బెజెపి గూటికి చేర‌డంతో ఆ కేసు అట‌కెక్కింది. మ‌హ‌రాష్ట్ర శివ‌సేన లీడ‌ర్, ఎంపి గౌలి అవినీతి కేసులో అయిదుసార్లు స‌మ‌న్లు వ‌చ్చిన సంద‌ర్భంలో ఆయ‌న షిండే శిబిరంలో చేరిపోయారు.. ఆ కేసు గురించి ఆలోచించ‌డ‌మే మానివేశారు.. య‌శ్వంత్ జాద‌వ్ దంప‌తులు కషాయం క‌ప్పుకోవ‌డ‌తో వారి కేసులు మాఫీ అయిపోయాయి.. అంటూ ప్ర‌శాంత్ భూష‌ణ్ పేర్కొన్నారు. ఆ ట్విట్ ను కెటిఆర్ రీ ట్విట్ చేశారు.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీలో చేరిన వారిపై కేసులను పట్టించుకోడం లేదు. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణపైనా గురి పెట్టాయన్న ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో .. కేటీఆర్.. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటున్నారో వివరించేలా ఉన్న ఈ ట్వీట్ కు బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ఇలాంటి వాటిపై వారెప్పుడూ మాట్లాడరు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close