వైసీపీ క్యాడర్‌లో ఇంత ఆనందమా !?

టీడీపీ గెలిచినందుకు టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విచిత్రంగా వైసీపీ ఓడిపోయినందున వైసీపీ క్యాడర్ కూడా సంబరాలు చేసుకున్నారు. కాకపోతే బయటకు కాదు. సోషల్ మీడియాలో తమ సంబరాన్ని చాలా మంది బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎంతో కష్టపడితే అధికారంలోకి వచ్చాక కనీసం పట్టిచుకోవడం లేదన్న అసంతృప్తే. ఇప్పుడైనా తమను పట్టించుకుంటారన్న ఓ ఆనందం వైసీపీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు , కార్యకర్తల్లో ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది. దీనికి కారణం వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అసలు పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా పోవడమే. ద్వితీయ శ్రేణి నేతలు కూడా చిన్న పని కోసం అయినా వాలంటీర్ల వద్దకు వెళ్లాల్సిందే. ఇది వైసీపీ క్యాడర్‌లో అసంతృరప్తికి కారణం అయింది. ఇక ఓ మాదిరి స్థాయి నేతలు.. తాము పార్టీ కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నా.. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అసంతృప్తికి గురవుతున్నారు.

కొంత మంది పనులు చేసినప్పటికీ బిల్లులు అందడం లేదు. గ్రామాల్లో పంచాయతీల అధికారాలు మొత్తం గ్రామ సచివాలయాలకే ఉండటంతో వైసీపీ అధినాయకత్వంపై గ్రామ స్థాయి నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉంది. అందుకే క్యాడర్ ను పట్టించుకోవాలన్న సందేశాలు ఎక్కువగా ఆ పార్టీ హైకమాండ్‌కు అందుతున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ హైకమాండ్ పూర్తిగా ఐ ప్యాక్ మాయలో ఉందని.. ఎవరూ మార్చలేరన్న నిర్వేదం కూడా వారిలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close