మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకా వీడియోలు ఉన్నాయా?

మంచు ఇంట్లో… అన్నాద‌మ్ముల గొడ‌వ‌తో కాక పుట్టిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌నోజ్ ఓ వీడియో విడుద‌ల చేయ‌డంతో… విష్ణుతో త‌న‌కున్న విబేధాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శుక్ర‌వారం అంతా ఇదే హాట్ టాపిక్‌. ఆ త‌ర‌వాత‌.. మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో ఆ వీడియో డిలీట్ చేశాడు. మోహ‌న్‌బాబు కూడా వెంట‌నే రంగంలోకి దిగి డామేజ్ కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. `అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు కామ‌న్‌` అని మంచు ల‌క్ష్మీ స‌ర్ది చెబుతోంది. అయితే.. మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకొన్ని వీడియోలు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే వాటిని సైతం సోష‌ల్ మీడియాలో పెట్ట‌బోతున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

మంచు సోద‌రుల మ‌ధ్య విబేధాలు ఇప్ప‌టివి కావు. ఎప్ప‌టి నుంచో న‌డుస్తున్న‌వే. అవ‌న్నీ..నివురుగ‌ప్పిన నిప్పులా ఉండేవి. నిన్న ఒకేసారి భ‌గ్గుమ‌న్నాయి. మ‌నోజ్ విడుద‌ల చేసిన వీడియో ఇప్ప‌టిది కాద‌న్న‌ది స‌న్నిహిత వ‌ర్గాల మాట‌. ఇలాంటి వీడియోలు మ‌నోజ్ ద‌గ్గ‌ర చాలా ఉన్నాయ‌ట‌. వాటిని సైతం మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పెట్టేస్తాడేమో అన్న‌ది మంచు కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌. మోహ‌న్ బాబు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాణం ఇచ్చే మ‌నిషి. అందుకే.. వెంట‌నే ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. విష్ణు, మ‌నోజ్‌ల‌తో ఆయ‌న మాట్లాడిన‌ట్టు, ఇక మీద‌ట ఎలాంటి ర‌చ్చ చేయ‌కుండా ఇద్ద‌రికీ న‌చ్చ చెప్పిన‌ట్టు టాక్‌. ఈ గొడ‌వ‌లు ఇక్క‌డితే ఆగిపోతే సంతోష‌మే. ఇంకాస్త ముదిరితే.. ఆ మిగిలిన వీడియోలు సైతం బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close