“రాపాక”తో డబ్బుల కథ వినిపిస్తున్న వైసీపీ !

జనసేన నుంచి వైసీపీకి ఫిరాయించిన రాపాక వరప్రసాద్‌తో వైసీపీ నేతలు కొత్త కథ వినిపించడం ప్రారంభించారు. ఆయన ఏదో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు సీక్రెట్‌గా చిత్రీకరించినట్లుగా వీడియోను లీక్ చేసి.. తర్వాత ఆయనతోనే ఇది నిజం చెప్పించే విన్యాసాలు ప్రారంభించారు. ఎలాగూ కూలి మీడియా ఇలాంటి వాటిని హైలెట్ చేసేందుకురెడీగా ఉంటుంది. అసలు రాపాకే పిరాయింపు ఎమ్మెల్యే. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మూడు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేని నేతను .. అన్ని పార్టీలు తిరస్కరిస్తే జనసేన అధినేత పవన్ టిక్కెట్ ఇచ్చారు.

అతి కష్టం మీ ద గెలిస్తే పవన్ మీదే దారుణమైన కామెంట్లు చేస్తూ వైసీపీలో చేరిపోయారు. ఓ సందర్భంలో అరెస్ట్ చేస్తారంటే పవన్ గట్టిగా నిలబడ్డారు. అయినా ఏదో ఆశించి వైసీపీలో చేరడమే కాకుండా.. ఇప్పుడు టీడీపీ డబ్బులు ఆఫర్ చేసిందంటూ కొత్త కథలు అల్లుతున్నారు. ఎవరు చేశారంటే ఉండి ఎమ్మెల్యే చేశారంటారు. మ ళ్లీ ఆయన నేరుగా ఆఫర్ ఇవ్వలేదంటారు. ప్రలోభ పెట్టారంటారు. జనసేన ఎమ్మెల్యే.. అసెంబ్లీ లాబీల్లో కనిపిస్తే పిచ్చాపాటిగా మాట్లాడాం కానీ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడలేదని.. ఉండి ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలు టీడీపీ నుండి డబ్బులు తీసుకున్నారని సజ్జల ఆరోపించారు. వారేమో నిరూపించాలని సవాల్ చేసి… సజ్జలపై రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. దానికి కౌంటర్ అన్నట్లుగా ఇలాంటి వీడియోలను వైసీపీ నేతలు విడుదల చేస్తున్నారు. అయితే ఇలాంటి చీప్ రాజకీయ టెక్నిక్కులు.. వైసీపీ, ఐ ప్యాక్ బ్రాండ్ అని ప్రజలకు అర్థమైపోయిందని ఎవరూ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. అసలు రాపాక ఎంత తీసుకుని పవన్ కల్యాణ్‌ను మోసం చేశారో చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close