ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏపీలో కొంటే ఖర్చయిపోయినట్లే !

ఓలా సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతోంది. నేరుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ ఇస్తారు. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన ఎస్ వన్ ప్రో మోడల్ కొనాలని యాప్‌లో ప్రయత్నిస్తే… హైదరాబాద్‌లో అన్ని ఖర్చులూ కలిపి 1 లక్షా 80వేలు చూపిస్తోంది. అదే గుంటూరులో డెలివరీ ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకుంటే మాత్రం రూ. రెండు లక్షలపైనే చూపిస్తోంది. ఎక్కడా తేడా వచ్చిందంటే.. రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ దగ్గర. తెలంగాణలో రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ ఐదు వందల రూపాయలు ఉంటే… ఏపీలో ఏకంగా ఇరవై వేల పైనే ఉంది. దీనికి కారణం ఎలక్ట్రిక్ వాహనాలపై ఏపీలో పూర్తి స్థాయిలో పన్ను బాదేస్తున్నారు. తెలంగాణలో మాత్రం రాయితీలు ఇస్తున్నారు.

పన్నులు పిండుకోవడంలో చాన్స్ వస్తే దేన్నీ వదులుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై వాజీవితకాల పన్ను 12శాతం విధిస్తూ రాష్ట్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యుత్‌ వాహనాల రేట్లు భారీగా పెరిగాయి. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యావరణ పరిరక్షణ, ఇంధన వినియోగం తగ్గించే చర్యల్లో భాగంగా 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ప్రకటించింది. ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మ్యానుఫ్యాక్షరింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇన్‌ ఇండియా పథకంలో భాగంగా 40శాతం వరకు రాయితీ సౌకర్యం ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయించారు.

ఆదాయం కోసం రాష్ట్రంలో వివిధ రకాల విద్యుత్‌ వాహనాలపై జీవిత పన్ను వసూలు చేస్తూండటంతో కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి. రూ.లక్ష విలువైన బైకుపై రూ.12వేలు జీవిత పన్నుగా చెల్లించాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్రోలు రేట్లు ఏపీలో అధికంగా ఉన్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ బైకులు కొనుగోలు చేయాలన్న వాహనదారులకు ప్రభుత్వం మరో విధంగా పిండుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ 30 ఫీట్ ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే !

తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో...

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

రీఎంట్రీకి శిశికళ రెడీ !

తమిళనాట స్టాలిన్‌కు పోటీ ఎవరు అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నామలైకు తమిళనాడులో తప్ప బయట కావాల్సినంత హైప్ వస్తోంంది. తమిళనాడులో పట్టించుకునేవారు లేరు. పన్నీరు సెల్వం,...
video

కల్కి.. సమయం చూడని సమరం

https://www.youtube.com/watch?v=5UfGZFrXKig మూడు సార్లు వాయిదా పడ్డ ‘కల్కి 2898 ఎ.డి’ భైరవ పాట ఎట్టకేలకు విడుదలైయింది. సంతోష్ నారాయణ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రచించిన ఈ పాట... దిల్జీత్‌ దోసాంజ్, దీపక్‌ బ్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close