ఆర్టీసీ బిల్లు వివాదంతో బీజేపీకి మరింత కష్టం !

తెలంగాణ బీజేపీకి ఏదీ కలసి రావడం లేదు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఆగ్రహాన్ని కూడా చూడాల్సి వస్తోంది. ఆర్టీసీని .. ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని .. హుటాహుటిన బిల్లు తయారు చేయించి.. గవర్నర్‌కు పంపారు. కానీ గవర్నర్ ఎప్పట్లాగే తన వద్దే అట్టి పెట్టుకున్నారు. విషయం బయటకు రావడం…. అసెంబ్లీ సమావేశాలను నేడే ముగించాలని నిర్ణయించడంతో వివాదాస్పదమయింది. అర్థరాత్రి సమయంలో గవర్నర్ బిల్లును తిరిగి పంపించారు. తన సందేహాలను సమాధానాలు కావాలని లేఖ రాశారు.

అంటే ఇప్పుడు బిల్లు… మళ్లీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ అన్ని సందేహాలకు సమాధానాలిచ్చినా గవర్నర్ హైదరాబాద్‌లో లేరు. ఆమె వచ్చిన తర్వాతనే చూసి… బిల్లును ఆమోదించి… ప్రభుత్వానికి పంపుతారు. అప్పుడే బిల్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది . దీంతో బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ ఉద్యోగుల్ని రంగంలోకి దింపారు. చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చేలా చేశారు. బస్సుల్ని రెండు గంటల పాటు నిలిపి వేయాలని కూడా నిర్ణయించారు. అయితే ఇలా ఉద్యోగులు.. రాజ్ భవన్ మీదకు వెళ్లడం అంటే.. చిన్న విషయం కాదు. అయితే … ఈ విషయాన్ని వీలైనంత రాజకీయం చేసుకోవడానికి బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఇప్పుడు బీజేపీ ఆర్టీసీ కార్మికులకు మేలు చేయకుండా అడ్డు పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం ఖాయమే. దీన్ని డిఫెండ్ చేసుకోవడం… బీజేపీ నేతలకు ఇబ్బందికరం. అందుకే ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. అసలు ఆర్టీసీ బిల్లు లో ఏదో ఓ లొసుగు పెట్టి కేసీఆర్.. విలీనాన్ని ఆలస్యం చేస్తారని… బీజేపీ నేతలు నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణం తామేనని ఆరోపించే పరిస్థితి రావడం వారికి ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ – బీజేపీ కౌంటర్ ఫలిస్తుందా..?

తెలంగాణకు పదేళ్లలో బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్ కు కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. అరవై ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఇచ్చింది వంకాయ....

సింగిల్ పీస్… సాయి పల్లవి

'భానుమతి ఒక్కటే పీస్... హైబ్రిడ్ పిల్ల' ఫిదా సినిమాలో సాయి పల్లవి చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ సాయి పల్లవి నట, వ్యక్తిగత జీవితానికి సరిగ్గా సరితూగుతుంది. సాయి పల్లవి ప్రయాణం...

ఆ బటన్లు నొక్కిన డబ్బులు రానట్లే – ఓటర్లకు మస్కా !

జనవరి నుంచి ఊరూరా వెళ్లి ఉత్తుత్తి బటన్లు నొక్కిన జగన్ రెడ్డి ఇప్పుడు పోలింగ్ రోజు వారి ఖాతాల్లో డబ్బులేసి ఓట్లు దండుకోవాలనుకున్నారు. ఈసీని మ్యానేజ్ చేసుకోవచ్చనుకున్నారు. అందుకే వచ్చిన...

‘క‌న్న‌ప్ప‌’ సెట్లో బాహుబ‌లి

మంచు విష్ణు ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో సౌత్ ఇండియ‌న్ స్టార్ల‌తో పాటు, బాలీవుడ్ స్టార్లు కూడా అతిథి పాత్ర‌ల్లో మెర‌వ‌బోతున్నారు. అక్ష‌య్‌కుమార్ శివుడి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే....

HOT NEWS

css.php
[X] Close
[X] Close