పరిచయాలు పెంచుకుంటున్న టీడీపీ, జనసేన క్యాడర్ !

పై స్థాయిలో మాట్లాడుకుని పొత్తులు పెట్టుకుంటే సరిపోదు.. ఓట్ల బదిలీ జరగాలంటే కింది స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం ఉండాలి… ఈ విషయాన్ని టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే గుర్తించాయి. పొత్తు ప్రకటన చేసిన వెంటనే ఆ పార్టీల నాయకత్వాలు… కింది స్థాయి వరకూ కలసిపోయే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అందులో భాగంగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు మొదట ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయిన తర్వాత నియోజకవర్గ .. మండల, గ్రామ స్థాయిలో పార్టీల నేతలు క లిసి పని చేసుకునే వాతావణాన్ని ఏర్పాట్లు చేసుకునే చాన్స్ ఉంది.

ఎన్నికల్లో ప్రజల ఆదరణ పొందడం అంటే… తమ ఓటర్లను.. తమకు ఓటు వేసే వాళ్లను పోలింగ్ బూత్ వరకూ వచ్చేలా చేసుకోవడం. ఇది ఎలక్షనీరింగ్. ఇలాంటి విషయాల్లో సక్సెస్ కావాలంటే కింది స్థాయి వరకూ పార్టీ నిర్మాణం ఉండాలి. జనసేన పార్టీకి ఇలాంటి నిర్మాణం లేదు. అందుకే గత ఎన్నికల్లో ఫ్యాన్స్ తో కూడా ఓటు వేయించుకోలేకపోయారు. ఫలితంగా ఆరు శాతం ఓట్లకే పరిమితమయ్యారు. స్వచ్చంగా తిరుగులేని అభిమానం ఉన్న వారు మాత్రమే ఓటు వేశార.. కానీ రాజకీయం అంటే… తమ ఓటు పక్కకుపోకుండా చూసుకోవడం కూడా కీలకమే.

వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పులు జరగకుండా.. టీడీపీ, జనసేన పొత్తులు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా… ఓట్ల బదిలీ జరగడానికి సమన్వయ సమావేశాలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని సీరియస్‌గా నిర్వహిస్తున్నారు. ఇలాంటి గ్రౌండ్ వర్క్ పకడ్బందీగా చేస్తే.. అద్భుత ఫలితాలు వస్తాయని.. టీడీపీ, జనసేన నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close