మళ్లీ తాటికొండ రాజయ్యకేనా పిలుపు

కడియం కావ్య కారు దిగిపోవడంతో ఇప్పుడు కేసీఆర్‌కు కాస్త బలమైన అభ్యర్థిని వెదుక్కోవాల్సి వస్తోంది. వరంగల్ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో బలమైన నేతల సమస్య ఉంది. టిక్కెట్ కోసం చాలా మంది రేసులో ఉంటున్నారు కానీ.. పోటీ ఇస్తారు అనుకున్న వారంతా జంప్ అవుతున్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఉన్నా ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ అనుకోలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

కేసీఆర్ మొదట ఎంపీ సీటుకు.. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు చాన్సివ్వాలనుకున్నారు. కానీ బీజేపీలో చేరిపోయి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఆపేందుు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కడియం కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరగడంతో ఆయన కుమార్తెకు టిక్కెట్ ప్రకటించారు. కానీ వర్కవుట్ కాలేదు. కడియం కోసం.. తాటికొండ రాజయ్యను అంతకు ముందే పక్కన పెట్టడంతో… అందరి కంటే ముందే పార్టీకి రాజీనామా చేశారు.

కానీ రాజయ్యను కాంగ్రెస్ చేర్చుకోలేదు. రేవంత్ రెడ్డిని రెండు, మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఆయన పేరును కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం రాజయ్య పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోయింది. ఇప్పుడు రాజయ్యనే పిలిచి టిక్కెట్ ఇస్తే బ్యాలెన్స్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా తమకు చాన్సివ్వాలని కోరుతున్నారు. మరి కేసీఆర్ ఏం ఆలోచిస్తారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close