‘కుష్’ డ్రగ్స్ నుంచి ఏపీ పాఠం నేర్చుకోవాలా..?

ఆఫ్రికా ఖండంలోని సియెర్రా లియోన్ దేశంలో జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇందుకు కారణం.. డ్రగ్స్ మహమ్మారి. ఊహించని స్థాయిలో అక్కడి యువత డ్రగ్స్ కు బానిసలుగా మారడంతో ఏం చేయాలో తెలియక ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు.పరిస్థితి చేయి దాటడంతో ప్రభుత్వం చివరి ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో డ్రగ్స్ కు సంబంధించి విస్తుపోయే నిజాలు వెల్లడి అవుతున్నాయి.

సియెర్రా లియోన్ లో డ్రగ్స్ కు బానిసలై ఎంతోమంది రోడ్లపై ఎక్కడిక్కడ పడిపోతున్నారు. అక్కడి యువతను మత్తుకు బానిస చేసిన ఈ డ్రగ్.. కుష్. ఎంజాయ్ కోసం దీనిని తీసుకున్న యువత మత్తులోకి జారుకొని ఏం చేస్తున్నారో అర్థం కాకుండా రోడ్లపైనే పడిపోతున్నారు. వారిని గుర్తించి కుటుంబాలకు అప్పగించడం అక్కడి ప్రభుత్వానికి సవాల్ గా మారింది.దీంతో కుష్ ని నియత్రించాలంటే అత్యవసర పరిస్థితిని విధించడమే మార్గమని భావించింది. కాని, ఈ డ్రగ్ ఆరేళ్ళ క్రితమే దేశంలోకి ప్రవేశించింది. అమ్మకాలు జోరండుకోవడంతో ప్రస్తుతం దేశం ప్రమాదకర స్థితికి చేరుకుంది.

తక్కువ ధరకు లభించడంతో కుష్ ని యువత ఎక్కువ మోతాదులో తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో డ్రగ్స్ మాఫియా పెద్ద మొత్తంలో సంపాదించినట్లు తెలుస్తోంది. సాధారణంగా డ్రగ్స్ వలన అత్యవసర పరిస్థితి వచ్చిందంటే అందులో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రమేయం లేకుండా పెద్ద మొత్తంలో డ్రగ్స్ దేశంలోకి ప్రవేశించే అవకాశం లేదు. లంచాలకు మరిగిన అక్కడి ప్రభుత్వం పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కుష్ తయారీలో మనుషుల ఎముకల పొడిని కూడా కలుపుతున్నారట.

దీంతో డ్రగ్స్ మాఫియా. .సమాధుల వద్ద భారీగా తవ్వకాలు ప్రారంభించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆస్థిపంజరాలను సేకరించి వాటి పొడిని కుష్ తయారీలో వినియోగిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం సమాధుల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది.దీంతో ఈ డ్రగ్ తీసుకున్న యువత తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రగ్స్ ను మొదట్లో నియత్రించకపోతే పరిస్థితి ఎలా మారుతుంది అనే దానికి సియెర్రా లియోన్ ఓ ఉదాహరణ.

ఇటీవల ఏపీలో 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. సీబీఐ ఈ కేసును పర్యవేక్షిస్తున్నా.. కేసు సంగతి అతీగతీ లేకుండా పోయింది. ప్రస్తుతం ‘కుష్ ‘వ్యవహారం ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా డ్రగ్స్ విషయంలో రాజకీయాలు మానేసి.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close