కూటమి తిరుపతి అభ్యర్థిగా కిరణ్ రాయల్..?

తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును మార్చే అవకాశం ఉందా..? కూటమి నేతలంతా ఆరణి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో అభ్యర్థి మార్పుపై జనసేనాని కసరత్తు ప్రారంభించారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.

కూటమి అభ్యర్థుల్లో 5 సీట్లు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. తాజగా చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, నారా లోకేష్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐదు సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చిస్తారని.. అందులో భాగంగా తిరుపతి అభ్యర్థి మార్పుపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన ఆరణి శ్రీనివాసులు పెద్దగా ఎవరికీ తెలియదు. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడాన్ని మొదటి నుంచి కూడా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానికుల్లో ఎవరికీ టికెట్ ఇచ్చినా కలిసి కలిసి పని చేస్తామని చెప్తుండటంతో…జనసేనానిపై స్థానిక నేతల ఒత్తిడి ఫలించనుందా అనే చర్చ జరుగుతోంది. తిరుపతి కూటమి నేతల ఫీడ్ బ్యాక్ మేరకు స్థానికులకు అవకాశం ఇవ్వాలని పవన్ నిర్ణయం తీసుకోనున్నారని..ఈ మేరకు కిరణ్ రాయల్ పేరు పరిశీలనలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కిరణ్ రాయల్ కు గెలుపు అవకాశం ఉంటుందని..ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్ కు మొదటి నుంచి కిరణ్ రాయల్ ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నారు. ఇటీవల పోతిన మహేష్ పవన్ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలకు కిరణ్ రాయల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. గత కొన్నాళ్ళుగా పార్టీకి అంకిత భావంతో పని చేస్తున్న కిరణ్ ను తిరుపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని జనసేన వర్గాల భోగట్టా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close