అవినాష్ రెడ్డికి వివేకా చివరి కోరిక తీర్చే చాన్స్ !

వైఎస్ వివేకానందరెడ్డిపై తమకు ఎంతో ప్రేమ ఉందని ఆయనను తాము ఎందుకు చంపుకుంటామన్నట్లుగా ప్రకటనలు చేస్తూ.. ఇప్పటికీ అమాయకంగా నటిస్తున్న అవినాష్ రెడ్డికి సునీత ..షాక్ ఇచ్చారు. అదే నిజం అయితే.. వివేకా చివరి కోరికను తీర్చాలన్నారు. ఆ చాన్స్ అవినాష్ రెడ్డి చేతుల్లో ఉందన్నారు. వివేకా చివరి కోరిక షర్మిల ఎంపీగా వెళ్లడమని.. అవినాష్ రెడ్డి పోటీ నుంచి వైదొలిగి షర్మిలకు మద్దతు ప్రకటించాలన్నారు. అవినాష్ రెడ్డికి వద్దని షర్మిలకే ఎంపీ సీటు ఇవ్వాలని వైఎస్ ఫ్యామిలీలో జరిగిన రాజకీయంలోనే హత్య జరిగిందని సీబీఐ చెబుతోంది. షర్మిలకు కూడా అదే చెబుతున్నారు.

పార్టీ కోసం కష్టపడిన షర్మిలకు చిన్న పదవి ఇవ్వడానికి కూడా జగన్ అంగీకరించలేదు. పూర్తిగా దూరం పెట్టారు. ఇక ఎంపీ పదవి అనే ఆలోచనే చేయలేదు. ఎక్కడో గుజరాత్ కు చెందిన వారికి.. తెలంగాణ వారికి రాజ్యసభ పదవులు ఇచ్చారు. కానీ షర్మిల ను పట్టించుకోలేదు. చివరికి ఆస్తి కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు షర్మిల కోసం అవినాష్ రెడ్డి పోటీ నుంచి విరమించుకునే అవకాశం లేదు. సునీత ఇచ్చిన సలహాపై అవినాష్ రెడ్డి స్పందించడం కూడా కష్టమే.

సునీత స్పష్టమైన సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టి జస్టిస్ ఫర్ వివేకా పేరుతో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి కౌంటర్ ఇవ్వడానికి అవినాష్ రెడ్డి విచిత్రమైన వాదనలతో తెరపైకి వస్తున్నారు. ఆధారాలు కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. విచారణ సీబీఐ సరిగ్గా చేయడంలేదని పాత వాదనే వినిపిస్తున్నాయి. కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యాలతో .. అసలు అవినాష్ రెడ్డి ఇంకా ఎలా బయట ఉన్నారన్న విస్మయం .. న్యాయనిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది. తండ్రిని జైల్లో ఉంచి.. అవినాష్ రెడ్డి మాత్రం సేఫ్ గా బయట తిరుగుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close