ఆ ఒక్క డైలాగ్ బీఆర్ఎస్ కు ఓట్లు తెచ్చి పెడుతుందా..?

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరిస్తోన్న విధానంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నినాదం లేక బీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

గత ఎన్నికల్లో కారు – సారూ.. ఢిల్లీలో సర్కార్ అంటూ తెగ హడావిడి చేసిన బీఆర్ఎస్ ..రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి నినాదంతో ముందుకు వెళ్ళాలో తేల్చుకోలేకపోతోంది. దాంతో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అగ్రనేతలు వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఓట్లను తెచ్చిపెడుతాయా అనే చర్చకు దారితీస్తోంది.

కేసీఆర్ , కేటీఆర్, హరీష్ రావు.. ఇలా పార్టీ ముఖ్య నేతలంతా ఒకటే పాట పాడుతున్నారు. ఏడాది తిరగకముందే రేవంత్ సర్కార్ పతనం అవుతుందని జోస్యం చెబుతున్నారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని ఆరోపణలు చేస్తున్నారు. ఏ సభా, సమావేశానికి వెళ్ళినా బీఆర్ఎస్ నేతలకు ఇది రొటీన్ డైలాగ్ గా మారింది. దీంతో ఈ డైలాగే బీఆర్ఎస్ కు ఎన్నికల నినాదమా అనే సెటైర్లు వేస్తున్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు దోహదం చేస్తాయా ..?అంటే అనుమానమే. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలంతా రేవంత్ సర్కార్ పతనం అవుతుందనే డైలాగ్ బీఆర్ఎస్ కు ఓట్లు రాల్చదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీలోకి రేవంత్ జంప్ అవుతాడనే ప్రకటన బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది తప్పితే..బీఆర్ఎస్ కు ఎలాంటి మెరుగైన ఫలితం తెచ్చి పెట్టదని స్పష్టం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close