ఇంత జరుగుతున్నా ఏపీ విషయంలో ఈసీ స్పందనేది !?

ఏపీలో జరుగుతున్న పరిణామాలు, అధికారులు ఈసీని సైతం ధిక్కరిస్తున్న వైనం సంచలనంగా మారుతోంది. అయితా ఈసీ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై లెక్కేలేనన్ని విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ పై రాయి దాడి జరిగితే కనీస చర్యలు లేవు. భద్రతాలోపం స్పష్టంగా కనిపించింది. ఓ పద్దతి లేకుండా పోలీసులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ లేకపోవడం వల్లనేనని ఈసీకీ పదే పదే ఫిర్యాదులు చేసినా స్పందన ఉండటం లేదు.

ఢిల్లీలో ఈసీ ఎన్డీఏ కూటమి తరపున ఫిర్యాదు చేశారు. గతంలో పురందేశ్వరి అధికారుల తీరును వివరిస్తూ.. గతంలో వారు చేసిన పనులను చెబుతూ.. నిష్పాక్షికమైన అధికారుల్ని నియమించాలని కోరుత లేఖలు రాశారు. సీతారామాంజనేయులు, రిషాంత్ రెడ్డి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. సీఎస్ వ్యవహారశైలి మరీ ఘోరంగా ఉంది. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఉన్నా చేయడంలేదు.

అతి కష్టం మీద ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. వాసుదేవరెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇస్తారో లేదో తెలియదు. ఏపీలో మద్యం పాలసీపై ఎన్నికల కోడ్ రాక ముందు నుంచీ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వాసుదేవరెడ్డి ఏపీ అధికారి కాదు. ఆయన ఐఆర్టీఎస్ అధికారి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటేషన్ పై ఏపీలో పని చేయడానికి వచ్చారు. నాలుగేళ్లుగా ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ లోనే ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి కావాల్సింతమద్యం స్టాక్ పంపారని ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. అతి కష్టం మీద ఆయనను బదిలీ చేయించగలిగారు.

సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ ను మారిస్తే తప్ప ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం ఎన్డీఏ కూటమికి లేదు. కానీ వారిని మార్చే విషయంలో ఈసీ ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close