ఆ క్రెడిట్ కోసం తెలంగాణా భాజపా నేతల యావ!

తెలంగాణా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ నిన్న నదీ జలాల పంపకాల కోసం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు. అది తెరాస ప్రభుత్వం చొరవ కారణంగానే సాధ్యమయిందని అందరికీ తెలుసు. దాని కోసం రాష్ట్ర భాజపా నేతలు చేసిందేమీ లేకపోయినా, దాని క్రెడిట్ స్వంతం చేసుకొనేందుకు వారు ప్రదర్శించిన అత్యుత్సాహం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకొంటున్నారు. ఆ ఒప్పందంపై ముఖ్యమంత్రులు ఇరువురూ సంతకాలు చేసిన తరువాత, రాష్ట్ర భాజపా నేతలు ముంబై చేరుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ని కలిసి, తెలంగాణాకు సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పి, ఆయనతో కలిసి ఆ ఒప్పంద పత్రం పట్టుకొని మీడియాకి ఫోజులు ఇచ్చారు. ఆ ఒప్పందం జరగడానికి తెరాస ప్రభుత్వం చూపిన చొరవ కారణం అయితే, ఆ ఖ్యాతి మాత్రం మహారాష్ట్ర (భాజపా) ప్రభుత్వానికే దక్కుతుందని వారు చెప్పారు. దీని గురించి భాజపా మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్ ఆహిర్ చాలా కాలంగా కృషి చేస్తున్నారని కానీ దాని క్రెడిట్ తమకే దక్కాలని వారెన్నడూ ఆరాటపడలేదని భాజపా ఎమ్మెల్యే డా. లక్ష్మణ్ చెప్పారు.

మాజీ ప్రధాని వాజ్ పేయి హయంలోనే నదుల అనుసంధాన ప్రక్రియ గురించి ఆలోచనలు చేసారని దానిని ప్రధాని నరేంద్ర మోడి సాకారం చేస్తున్నారని, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఒప్పందం జరగడం చాలా శుభ పరిణామమని వారు చెప్పారు. కేంద్రంలో, మహారాష్ట్రాలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు సహకరించడం వలననే ఈ ఒప్పందం సాధ్యపడిందని వారు మీడియాకి చెప్పారు. తెలంగాణాలో గోదావరి మరియు ఇతర నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం సహాయసహకారాల కోసం తమవంతు ప్రయత్నాలు తాము చేస్తామని చెప్పారు. తెలంగాణాలో సముద్రం లేదు కనుక నదీ మార్గాలలో జలరవాణా వ్యవస్థల ఏర్పాటుకు సహకరించమని తాము చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. ఈ మహా ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామని భాజపా ఎమ్మెల్యే డా.లక్ష్మణ్ చెప్పారు.
కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణా కోసం రాష్ట్ర బీజేపీ నేతలు చేసిందేమీ లేదు కానీ తెలంగాణా ప్రభుత్వం చొరవతో సాధ్యమయిన ఈ ఒప్పందంపై క్రెడిట్ స్వంతం చేసుకోవడానికి హడావుడిగా అందరూ ముంబై పరుగులు తీయడం, ఆ క్రెడిట్ తెలంగాణా ప్రభుత్వానిది కాదు…మహారాష్ట్ర ప్రభుత్వానిది, కేంద్రప్రభుత్వానిదేనని వారు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణా భాజపా నేతలకు అటువంటి క్రెడిట్ కావాలని కోరుకొంతున్నట్లయితే, డిల్లీ వెళ్లి రాష్ట్రం కోసం ఏమయినా సాధించుకొని వస్తే బాగుంటుంది. కానీ వారు అలాగ చేయకుండా తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న పనులను నిత్యం విమర్శిస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మళ్ళీ అది చేసే ఇటువంటి మంచి పనులలో తమకీ వాటా ఉండాలని ఆశిస్తుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close