వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. మొత్తం తన వాళ్లు చెప్పినట్లుగా చేస్తే ఏ సమస్యా రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని దస్తగిరి తన సీబీఐ స్టేట్ మెంట్‌లో చెప్పారో లేదో కానీ.. మీడియాతో చెబుతున్నారు.

వివేకా హత్య కేసులో జగన్ వ్యవహారశైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. సాక్షి మీడియాలో గుండెపోటు అని ప్రచారం చేయడం దగ్గర్నుంచి ఆయన హత్య అని తెలిసిన తర్వా త కూడా రోడ్డు మార్గంలో కడపకు వెళ్లడం వరకూ .. మొత్తం గూడుపుఠాణి ఉందన్న అనుమానాలున్నాయి. అలాగే హత్య జరిగిన వెంటనే.. ఎవరికీ తెలియక ముందే పనైపోయిందని భారతికి తెలిసిందని .. అజేయకల్లాం వాంగ్మూలం ఇచ్చారు. అన్ని డాట్స్ కలుపుతూ పోతే ఈ కేసు జగన్ దగ్గరకే చేరుతుందన్న అనుమానాలు చాలా కాలం వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు దస్తగిరి అదే చెబుతున్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తునకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. చివరికి ఓ నిందితుడ్ని సీబీఐ అరెస్టు చేయలేకపోవడం అనే విచిత్రం కూడా ఈ కేసులోనే చోటు చేసుకుంది. జూన్ నాలుగో తేదీ తర్వాత .. వివేకా హత్య కేసులో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని వేళ్లూ జగన్ వైపు చూపించేలా పరిణామాలు మారుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : మీడియా విశ్వసనీయతపై ఆర్కే ఆవేదన

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతోందని.. ప్రజలు ఎవరూ నమ్మలేని పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేయడానికి కేటాయించారు. చాలా కష్టపడి...

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...
video

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ట్రైల‌ర్‌: ఇది మ‌రో ర‌కం సినిమా

https://youtu.be/UY31pDh055o?si=kVsguDvBSdE7xJ5Y 'మాస్ కా దాస్' అనే ట్యాగ్ లైన్‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న నుంచి వ‌స్తున్న మ‌రో పూర్తి స్థాయి మాస్‌, మ‌సాలా, పొలిటిక‌ల్ ధ్రిల్ల‌ర్‌... 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'....

బీఆర్ఎస్ ను బుక్ చేసిన సీబీఐ మాజీ జేడీ..!?

ఏపీకి రాజధాని లేకపోవడంతో మరో పదేళ్లు హైదరబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close