అఖిల్ ను ఇంప్రెస్ చేసిన దర్శకుడు.. ఛాన్స్ ఇచ్చేనా..!

అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్ తెరంగేట్రం ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలిసిందే.. అఖిల్ అంటూ ఓ మిసైల్ లా వచ్చిన చినబాబు హిట్ కొట్టలేదు అన్న డిసప్పాయింటే కాని మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నంలో కొంతవరకు ఓకే అనిపించాడని చెప్పాలి. ఇక అఖిల్ కు చాలా అవసరమైన రెండో సినిమా హిట్ ఎవరి చేతిలో పెట్టాలా అనే ఆలోచనలో తర్జన భార్జనలో ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ.

మొదటి సినిమా వి.వి.వినాయక్ చేతిలో పెడితే అది కాస్త చాలా అపవాదాలు మూటకట్టుకునేలా చేసింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ తన రెండో సినిమా ఊపిరి దర్శకుడు వంశీ పైడిపల్లితో తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఊపిరి కథ చెప్పినప్పుడు నాగ్ పాత్ర నచ్చలేదు కాని ఆ సినిమా టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే వంశీ టాలెంట్ తెలుస్తుంది అని.. ఊపిరి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అఖిల్ అన్నాడు. సో వంశీ టాలెంట్ ను గుర్తించాడు కాబట్టి అతనితోనే తన రెండో సినిమా ఉంటుందని చూచాయగా చెప్పాడని అనుకుంటున్నారు సిని జనాలు.

వంశీ తీసిన సినిమాలను చూస్తే ఏది అట్టర్ ఫ్లాప్ అయిన దాఖలాలు లేవు. అయితే సూపర్ హిట్ లేదంటే యావరేజ్ గా నిలిచాయి తప్ప వంశీ చేసిన మున్నా ఒక్కటే కాస్త బిలో యావరేజ్ అయ్యింది కాని మిగతా సినిమాలన్ని మంచి రిజల్ట్ ను ఇచ్చాయి. మరి చూస్తుంటే ఇక అధికారికంగా అఖిల్ రెండో సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లినే అని ఎనౌన్స్ చేయడమే తరువాయి అన్నట్టు ఉంది. ఎందుకంత తొందర ఒకవేళ అదే ఫిక్స్ అయితే అభిమానులకు త్వరలోనే ఎనౌన్స్ చేసేస్తారు అక్కినేని నాగార్జున.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close