టాటాతో మమతా బెనర్జీ రాజీకి సిద్దం!

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నానో కార్ ప్రాజెక్టు స్థాపించేందుకు దేశంలో అనేక రాష్ట్రాలను పరిశీలించిన తరువాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలోని సింగూరుని ఎంపిక చేసుకొంది. అప్పుడు అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం టాటా సంస్థకు సుమారు 1000 ఎకరాలను ఇచ్చింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యవసాయ భూములలో ఆ కర్మాగారాన్ని నెలకొల్పాలనే టాటా ప్రయత్నాలను చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. భూములు కోల్పోయిన రైతులు, స్థానిక ప్రజలు, పర్యావరణ సంస్థల ప్రతినిధులు, రాష్ట్రంలోని మేధావులు ఆమెకు మద్దతు పలకడంతో నానో కార్ల కర్మాగారానికి బ్రేక్ పడింది.

నానో ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టాటా సంస్థ చైర్మన్ రతన్ టాటా ఎట్టి పరిస్థితులలో కూడా 2008 లోగా మొట్ట మొదటి నానో కారును విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఎవరూ ఊహించలేని నిర్ణయం తీసుకొన్నారు. సింగూరులో ఇంక నానో కార్ల తయారీ కేంద్రానికి అవరోధాలు ఎదురవుతున్నందున, దానిని తక్షణమే గుజరాత్ రాష్ట్రంలోని సనంద్ అనే ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. వెంటనే తన నిర్ణయాన్ని అమలుచేసి చూపించి, 2009, మార్చి23న మొట్టమొదటి నానో కారుని మార్కెట్లోకి విడుదల చేసారు.

సింగూరులో నానో కార్ల తయారీ కేంద్రం కోసం సేకరించిన 1000 ఎకరాలపై నాటి నుండి నేటి వరకు కూడా న్యాయస్థానంలో కేసులు నడుస్తూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న తన పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తూ దాని గురించి కూడా ఒక ఆసక్తికరమయిన ప్రతిపాదన చేసారు. సింగూరులో టాటా సంస్థ సేకరించిన 1000 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తమ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని మమతా బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానంలో ఉంది కనుక ఇక దానిపై తామేమీ చేయలేమని చెప్పారు.

టాటా సంస్థ తన్న అధీనంలో ఉన్న 600ఎకరాలలో కార్ల తయారీ సంస్థను పెట్టుకొని, మిగిలిన 400 ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేసేందుకు అంగీకరించే మాటయితే, తమ ప్రభుత్వం టాటా సంస్థకి సహకరిస్తుందని మమతా బెనర్జీ నిన్న ఒక రాజీ ప్రతిపాదన చేయడం విశేషం. ఆమె స్వయంగా నానో సంస్థని రాష్ట్రం నుండి బయటకు తరిమేసి, ఇప్పుడు మళ్ళీ ఆమే రాజీ ప్రతిపాదన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఉద్యమిస్తూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి కనుకనే ఆమె ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజీ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close