పుష్కరస్నానంలో గవర్నర్ సమన్యాయం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ అసలే పరమభక్తుడు. వీలు దొరికితే చాలు తిరుమల వెళ్ళి దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక మహా పుష్కరాలకు హాజరవకుండా ఉంటారా! అయితే రెండు రాష్ట్రాలలో ఒకచోటికి వెళితే మరొకరిని నొప్పించినట్లువుతుందనుకున్నారో, ఏమో!  పుష్కరస్నానంలో సమన్యాయం ప్రదర్శించారు. ఇరు రాష్ట్రాలలోనూ గోదావరిలో పుష్కరస్నానమాచరించారు. ఉదయం హైదరాబాద్‌నుంచి సతీసమేతంగా మొదట రాజమండ్రి వెళ్ళి సరస్వతి ఘాట్‌లో స్నానం చేశారు. తర్వాత వసతిగృహానికి వెళ్ళి బట్టలుమార్చుకున్నారు. సింగపూర్ బృందంతో బిజీగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చి ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌ను పలకరించారు. తర్వాత గవర్నర్ అక్కడనుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంజిల్లాలోని భద్రాచలంవెళ్ళి సమీపంలోని మోతే పుష్కరఘాట్‌లోకూడా స్నానమాచరించారు. భద్రాచలం రామాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close