పార్లమెంట్‌సమావేశాలు ప్రారంభం: బీజేపీపై పార్టీనేత లెటర్ బాంబు

హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవలికాలంలో చనిపోయిన పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీలకు నివాళులు, ఇస్రో శాస్త్రవేత్తలకు, పేస్, సానియాలకు అభినందనలు ప్రకటించిన తర్వాత లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. కడియం శ్రీహరి రాజీనామాను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. అటు రాజ్యసభలోమాత్రం లలిత్ మోడి వ్యవహారంపై గందరగోళం చెలరేగింది. రాజస్థాన ముఖ్యమంత్రి వసుంధర రాజేపై విపక్షాలు విమర్శలు గుప్పించారు. లలిత్ మోడి అంశంపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుపట్టారు. ఐపీఎల్ వ్యవహారంపై చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ప్రకటించారు. సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన లలిత్ మోడివంటి వ్యక్తికి విదేశాంగ వ్యవహారాలశాఖమంత్రి సుష్మా స్వరాజ్ సహాయపడటం, మరో కేంద్రమంత్రి స్మృతి ఇరాని విద్యార్హతల వ్యవహారం, వసుంధర రాజే వ్యవహారం, మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన వ్యాపం కుంభకోణం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రతిపక్షాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.  అయితే మంత్రులెవరూ రాజీచేయాల్సిన అవసరంలేదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి వెంకయ్య నాయుడు నిన్న అఖిలపక్షసమావేశం ముగిసిన తర్వాత చెప్పారు.

మరోవైపు కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకవైపు వివిధ వివావాదాలలో ఇరుక్కోవటంలో ఇబ్బంది పడుతున్న అధికారపక్షంపై సొంతపార్టీకే చెందిన ఒక ఎంపీ ఒక లెటర్ బాంబు పేల్చారు. బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు రావటం పార్టీ ప్రతిష్ఠకు మచ్చలు పడుతున్నాయని, అవినీతిని నిర్మూలించేందుకు పార్టీలో ఒక ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మాజీ మంత్రి శాంతకుమార్ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. ఈ లేఖ రాసి పదిరోజులైనప్పటికీ, ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాబోతున్న తరుణంలో నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో బయటపడిన అవినీతికిగానూ సంబంధిత నాయకులపై పేర్లు ప్రస్తావించకుండా ఘాటుగా విమర్శలు చేశారు. శాంతకుమార్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close