ఏప్రిల్ 27న ఖమ్మంలో తెరాస ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభ

తెరాస ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న ఖమ్మంలో పార్టీ ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు తెలంగాణా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణా భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ మరియు శాసనసభా పక్ష నేతల సమావేశం నిర్వహించారు. దానిలో పార్టీ ప్లీనరీ సమావేశాల తేదీని, స్థలాన్ని ఖరారు చేసారు. ఏప్రిల్ 27 ఉదయం తెరాస ప్రతినిధుల సమావేశాలు, సాయంత్రం అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కడియం శ్రీహరి చెప్పారు. వీటి కోసం కమిటీలను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణా శాసనసభ సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజక వర్గాలలో బస్సు యాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొంటారని, అదే సమయంలో ఆయా నియోజక వర్గాలలో అమలవుతున్న లేదా పెండింగులో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను సమీక్షిస్తారని చెప్పారు. కనుక ఎమ్మెల్యేలు అందరూ తమ తమ నియోజక వర్గాలలో పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలని కోరారు. మరొక రెండు వారాలలోగా నామినేటడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని కడియం చెప్పారు. తెరాస పార్టీ కోసం పార్టీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు అందరూ విరాళాలు ఇవ్వాలని కోరారు. ఆ మొత్తాన్ని తెరాస కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లింపులకి, ప్రతీ నియోజక వర్గంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close