పి. రాములు తెదేపాకి గుడ్ బై…అయితే ఏమిటి?

ఇవ్వాళ్ళ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో తెలంగాణా రాష్ట్రాలో కరువుతో అల్లాడుతున్న రైతుల వ్యధకు అద్దం పడుతూ “మేము ఆత్మహత్య చేసుకొననవసరం లేదు ఎందుకంటే ఎలాగూ కరువుతో చచ్చిపోబోతున్నాము కనుక!” అని శీర్షికన ఒక కధనం ప్రచురించింది. అది చూస్తే చాలా బాధ కలుగుతుంది కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తెలంగాణాలో తెదేపా పరిస్థితి కూడా అక్షరాల అలాగే ఉందిపుడు. దానిని ఇంకా ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. దానంతట అదే క్రమంగా మాయమయిపోవచ్చు. కనుక ఇప్పుడు పార్టీలో ఎవరు ఉన్నా, వెళ్ళిపోయినా దానికి పెద్ద తేడా ఉండదు.

ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పి. రాములు నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరిపోయినప్పుడు “తెలంగాణాలో తెదేపాకు మరో ఎదురుదెబ్బ” అనే హెడ్డింగ్ తో మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చేయి. అవి చూసినప్పుడు ప్రజలు నవ్వుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి కొత్తగా తగిలే ఎదురు దెబ్బలు ఏమీ చేయలేవు. అది ఇప్పటికే కోలుకోలేని స్థితికి చేరుకొంది. దాని అధినేత చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కనుక ఇంక ఎవరున్నా వెళ్ళిపోయినా ఆ పార్టీకి కొత్తగా వచ్చే లాభంకానీ నష్టం గానీ ఏమీ ఉండబోవు.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెదేపాకి తెలంగాణాలో ఇటువంటి దయనీయమయిన పరిస్థితి ఏర్పడటం దాని అభిమానులకు బాధ కలిగిస్తుండవచ్చు కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత ఉంది. కనుక ఏవిధంగా చేస్తే గౌరవప్రదంగా పార్టీని మూసివేసుకోవచ్చో, పార్టీలో మిగిలి ఉన్న నేతలు ఏవిధంగా తమ రాజకీయ భవిష్యత్ ని కాపాడుకోవాలో ఇప్పుడే ఆలోచించుకొంటే మంచిదేమో? లేకుంటే ముందు ఇంకా అవమానకర పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు.

ఈవిధంగా ఆలోచించడం చాలా దుర్మార్గంగా కనిపించవచ్చు లేదా రాజకీయ దురుదేశ్యంతోనే సూచిస్తున్నట్లు కనబడవచ్చు కానీ వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాస్తవిక దృక్పధంతో ఆలోచిస్తే ఇదే సరయినదని అంగీకరిస్తారు. లోక్ సత్తా పార్టీనే ఉదాహరణగా తీసుకొంటే అదికూడా ఇటువంటి వాస్తవిక దృక్పధంతోనే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగడం గమనించవచ్చు. కనుక తెలంగాణాలో తెదేపా కూడా తన భవిష్యత్ గురించి వాస్తవిక దృక్పధంతో ఆలోచించవలసిన సమయం ఇదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close