అలాగైతే పీవీపీ దేవుడే

మ‌హేష్‌బాబు బ్ర‌హ్మోత్స‌వం దెబ్బ‌కు పీవీపీ ఇప్ప‌ట్లో తేరుకొనేట్టు క‌నిపించ‌డం లేదు. ఎంత పోతుంద‌న్న‌ది ర‌మార‌మీగా తెలీదుగానీ.. క‌నీసం స‌గానికి స‌గం మునిగిపోవ‌డం ఖాయం. ముఖ్యంగా భారీ రేట్లు పెట్టి కొనుక్కొన్న బ‌య్య‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోతారు. ప్ర‌స్తుతం పీవీపీ అండ్ కో.. న‌ష్ట‌మెంత‌? అనే లెక్క‌లు తేల్చ‌డంలో బిజీగా ఉంద‌ని టాక్‌. ఈమ‌ధ్య ఏ పెద్ద సినిమా పోయినా, ఆ నిర్మాత‌ని బ‌య్య‌ర్లు చుట్టుముట్టేస్తున్నారు. న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ త‌ల‌నొప్పి ఎందుక‌ని ‘నో రిట‌ర్న్స్‌’ అంటూ ఓ కాగితంపై సంత‌కం పెట్టించుకొన్నాడ‌ట పీవీపీ. దాంతో బ‌య్య‌ర్ల‌కు ఇప్పుడు డిమాండ్ చేసే ఛాన్సు లేదు. కానీ.. పీవీపీ పెద్ద మ‌న‌సుతో న‌ష్టాల్ని భ‌ర్తి చేస్తానంటూ బ‌య్య‌ర్లకు ఇప్పుడు భ‌రోసా ఇస్తున్నాడ‌ట‌.

”30 నుంచి 40 శాతం పోతే మీరే చూసుకోండి.. అంత‌కంటే ఎక్కువ న‌ష్ట‌పోతే నేను భ‌ర్తీ చేస్తా” అంటూ బ‌య్య‌ర్లకు మాటిచ్చాడ‌ట పీవీపీ. దాంతో వాళ్లు కాస్త రిలాక్స్ అవుతున్నారు. 20 శాతం న‌ష్టాల్ని భ‌రించ‌డం అంటే మాట‌లు కాదు. అదీ ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా లేదాయె. కానీ.. పీవీపీ పెద్ద మ‌న‌సుతో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో బ‌య్య‌ర్లు ఖుషీ అవుతున్నారు. నిజంగా ఇదంతా నిజ‌మైతే, బ‌య్య‌ర్ల‌కు పీవీపీ క‌నీసం ఇలాగైనా ఆదుకొంటే.. ఆయ‌న దేవుడు కిందే లెక్క‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close