మంత్రి లక్ష్మారెడ్డి డాక్టర్ పట్టాపై వివాదం

హైదరాబాద్: ఇటీవల జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల డిగ్రీ సర్టిఫికెట్‌లు నకిలీవంటూ వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డికూడా అలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. లక్ష్మారెడ్డి మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు డాక్టరని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలకేంద్రంలో ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా నిన్న రేవంత్ మంత్రిపై నేరుగా ఈ ఆరోపణ చేశారు. మద్దూరు తన నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోది కావటంతో మంత్రి పాల్గొన్న ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురిమధ్య మాటా మాటా వచ్చినపుడు రేవంత్ మంత్రిపై ఈ ఆరోపణ చేశారు. మరోవైపు ఈ ఆరోపణపై ఒక దినపత్రిక కొంత పరిశోధన చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్ష్మారెడ్డి చదివింది హోమియోపతి డాక్టర్ కోర్స్. అయితే ఆయన 2004 ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనేమో 1988లో గుల్బర్గా యూనివర్సిటీనుంచి బీహెచ్ఎమ్ఎస్ కోర్స్ చేశానని, 2014 ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనేమో 1987లో గుల్బర్గాలోని హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీవారి కాలేజిలో బీహెచ్ఎమ్ఎస్ కోర్స్ చేశానని పరస్పర విరుద్ధంగా పేర్కొన్నారు. మరోవైపు లక్ష్మారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, తాను గుల్బర్గా యూనివర్సిటీనుంచి బీహెచ్ఎమ్ఎస్ చేశానని, ఆ పట్టాతో రిజిస్టర్ చేసుకున్నానని, తనది బోగస్ పట్టా అయితే రిజస్టర్ చేసుకోరని చెప్పారు.

పదవులలో ఉన్న రాజకీయ నాయకుల విద్యార్హతలపై వివాదాలు రావటం ఇటీవల ట్రెండ్ అయిపోయింది కాబట్టి లక్ష్మారెడ్డికూడా దీనిని పట్టించుకోనవసరంలేదు. కేంద్ర మానవ వనరులశాఖమంత్రి స్మృతి ఇరాని, ఢిల్లీ న్యాయశాఖమంత్రి జితేందర్ సింగ్ తోమార్, ఆప్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే సురేందర్ సింగ్‌, మహారాష్ట్ర విద్యాశాఖమంత్రి వినోద్ తవ్డేలపై ఇటీవల ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. స్మృతి ఇరాని వివాదం పార్లమెంటులోకూడా ప్రతిధ్వనించగా, ఇక ఢిల్లీ మంత్రి తోమార్ అయితే అరెస్టయ్యి ఊచలుకూడా లెక్కలుపెట్టారు. రాజకీయాలలో ఇవన్నీ మామూలే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close