తెదేపా కాపు నేతల సమావేశానికి మంత్రులు డుమ్మా?

ముద్రగడ పద్మనాభం అరెస్ట్, దాని పర్యవసానాలపై చర్చించి తదుపరి కార్యాచరణ నిర్ణయించేందుకు శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో హ్యాపీ రిసార్ట్స్ లో కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజ అధ్యక్షతన సమావేశం ఏర్పాటుచేశారు. దానికి ప్రభుత్వంలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలో కాపు నేతలు, కాపు సంఘాల నేతలను ఆహ్వానించారు. కానీ ఆ సమావేశానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు, రామానుజ తప్ప మరెవరూ హాజరుకాలేదని తెలుస్తోంది.

ముద్రగడ అరెస్ట్ కారణంగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున నిర్వహించబడుతున్న ఆ సమావేశానికి హాజరయితే కాపు సామాజిక వర్గానికి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందనే భయంతోనే ఎవరూ హాజరు కాలేదని సాక్షి మీడియా పేర్కొంది. కానీ తెదేపాలో కాపు మంత్రులు, నేతలు బహిరంగంగానే ముద్రగడ పద్మనాభంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తుని విద్వంసానికి ఆయనే కారకుడని వాదిస్తున్నారు. కనుక ఆయన అరెస్ట్ ని కూడా గట్టిగా సమర్ధిస్తున్నారు. ఆయన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని గట్టిగా వాదిస్తున్నారు. అటువంటప్పుడు ఈ సమావేశానికి హాజరైనంత మాత్రన్న వారికి కొత్తగా వచ్చే నష్టం ఏముంటుంది? అని ఆలోచిస్తే సాక్షి వాదన అర్ధరహితమని స్పష్టం అవుతుంది. కానీ కాపు కార్పోరేషన్ ఇచ్చే రుణాల మంజూరు కోసం రికమండేషన్ లేఖలు ఇచ్చే కాపు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో? ఇంతకీ ఆ సమావేశంలో పాల్గొన్నవారు ఆ వివరాలనైనా బయటపెడితే బాగుండేది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close