వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి కార్యకర్తలకు జగన్ 2.0 చూపిస్తానని భయపెడుతున్నారు. అందరూ రోడ్ల మీదకు వచ్చి కేసులు పెట్టించికోవాలని పిలుపునిస్తున్నారు. ఇతరులు రాకపోతే కనీసం రౌడీలు, బాధ్యతలు లేని వాళ్లను అియినా ప్రోత్సహించాలని తెనాలి వేదికగా ఓ ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో కానీ.. ఇప్పుడు జగన్ వైపు చూస్తున్న తమ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారి గురించి ఇప్పుడు కనీసం పట్టించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ కార్యకర్తలు వాలంటీర్లు. వాలంటీర్లను జగన్ రెడ్డి కూడా గాలికి వదిలేశారు.
వాలంటీర్ల గురించి ఒక్క సారి ఆలోచించని జగన్ రెడ్డి
ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించలేదు. దానికి కారణం గత ప్రభుత్వం ఎలాంటి జీవోలు లేకుండా వాలంటీర్లను నియమించడం. జగన్ రెడ్డి పాలనలోనే ఆరు నెలల ముందే వాలంటీర్ల గడువు ముగిసింది. కానీ పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇది ప్రభుత్వం చెబుతున్న విషయం. నిజంగా జగన్ రెడ్డి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వారికి నెలకు పది వేలు అందేవి. జగన్ రెడ్డే వారి ఖాతాలను క్లోజ్ చేయడంతో ఏమీ చేయలేకపోతున్నారు. అలాంటి అన్యాయం జరిగిపోయినందున.. వారి కోసం జగన్ రెడ్డి ఏదో ఒకటి చేయాల్సి ఉంది. కానీ ఏమీ చేయడం లేదు.
వాలంటీర్ల జీవితాలను నాశనం చేసి వదిలేస్తారా ?
వాలంటీర్లకు జగన్ రెడ్డి చాలా ఆశలు చూపించారు. రాజకీయ నేతల్ని చేస్తానన్నారు. వారికి చేయకూడదని పనులు చెప్పి చేయించుకున్నారు. సమాచార సేకరణ చేయించారు. అన్నీ చేసినందుకు వారు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇతర పనులు చేయకుండా ఐదు సంవత్సరాల పాటు వాలంటీర్లుగా పని చేయడం వల్ల.. జీవితంలో ఎదిగే అవకాశాన్ని కోల్పోయారు. మరి ఇప్పుడు వారి కోసం జగన్ రెడ్డి ఏం చేస్తారన్న ఆలోచన రావడం లేదు. ఎందుకంటే ఆయన కూడా వదిలేశారు. వాలంటీర్ల వల్లే ఓడిపోయామని జగన్ రెడ్డి సన్నిహితులు అంటున్నారు. తమను జగన్ రెడ్డి ఇలా వదిలేయడంతో వారంతా వేదన చెందుతున్నారు.
మళ్లీ వస్తే వాలంటీర్లు ఉంటారని కూడా చెప్పని జగన్
మళ్లీ వస్తే… అందర్నీ లోపలేస్తాం.. లేపేస్తాం అని హెచ్చరికలు చేస్తున్నారు కానీ.. వాలంటీర్లను తీసుకుంటామని చెప్పడం లేదు. ఎందుకంటే వాలంటీర్లను మళ్లీ తీసుకుంటామని చెబితే క్యాడర్ కు కోపం వస్తుంది. ఉన్న క్యాడర్ కూడా రోడ్డు మీదకు రాదు. ఇప్పుడు తాను వస్తే మళ్లీ 2.0 చూపిస్తానని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా నమ్మించడానికి మళ్లీ వాలంటీర్లు ఉండరని నమ్మిస్తున్నారు. అంటే ఇప్పటికైతే వాలంటీర్లను కూడా జగన్ రెడ్డి వదిలేశారన్నమాట. ఇంత కంటే సొంత మనుషులకు వెన్నుపోటు ఎవరు పొడుస్తారు ?