నితిన్– వేణు శ్రీరామ్ కాంబినేషన్లో రూపొందిన మూవీ ‘తమ్ముడు’. దిల్ రాజు నిర్మాత. జూలై 4న ఈ సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ రోజు ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లోనే కథను దాదాపుగా రివీల్ చేశారు. అక్క మాట కోసం నిలబడ్డ తమ్ముడి కథ ఇది.
“మీ అక్కని చూశావా? తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ క్యారెక్టర్ లూజ్ అవ్వలేదు.”
“చేసిన తప్పువల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడా మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది.” ట్రైలర్ ప్రారంభంలో వినిపించిన ఈ రెండు డైలాగులు తమ్ముడు కథలోని కోర్ ఎమోషన్ను హైలైట్ చేశాయి. అయితే ఈ కథలో మరో కీలక ఎలిమెంట్ ఉంది. ‘అబంరగొడుగు’ అనే ప్రాంతం, అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఒకటే దారి. ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేది చాలా ఆసక్తికరం.
ట్రైలర్లో యాక్షన్కు పెద్దపీట వేశారు. అబంరగొడుగు అనే ఊరిని నేపథ్యంగా తీసుకున్న యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. “ప్రపంచానికి ప్రేమతో చెబితే అర్థం కాదు… అదే వైలెన్స్తో చెబితే!”అనే డైలాగ్తో హీరో యాక్షన్లోకి దిగడం, తర్వాత వచ్చే ఫైటింగ్ సీక్వెన్స్లు, ముఖ్యంగా ఫైర్ సీన్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
విలువిద్య క్రీడాకారుడిగా పరిచయమైన నితిన్, ఆ విద్యను అబంరగొడుగు అటవీ ప్రాంతంలో ఎలా ఉపయోగించాడు అన్నది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. దర్శకుడు శ్రీరామ్ వేణు యాక్షన్, ఎమోషన్లకు పెద్దపీటవేస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
అక్క సెంటిమెంట్ ఈ సినిమాలో కీలకం. అక్క పాత్రలో లయ నటించింది. ట్రైలర్లో ఒక్క ఫ్రేమ్లో మాత్రమే కనిపించినా, ఆమె ప్రెజెన్స్ హుందాగా ఉంది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాసిక వంటి ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఆసక్తికరంగా కనిపించాయి. అజినీస్ లోక్ నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బలంగా వినిపించింది. అక్క సెంటిమెంట్ మీదే ట్రైలర్ ఓపెన్ అయింది, అదే సెంటిమెంట్ మీదే క్లోజ్ అయింది. ఈ ఎమోషన్ ప్రేక్షకులను తాకితే ‘తమ్ముడు’కు తిరుగే లేదు.