చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు ఆకురౌడీ. ఆయన ఆస్తులెంతో.. ఆదాయమెంతో స్వగ్రామంలో అందరికీ తెలుసు. కానీ వైఎస్ సీఎం అయ్యాక “పట్టు పరిశ్రమ”లో రాటుదేలిపోయిన చెవిరెడ్డి.. తన ప్రతాపం చూపించడం ప్రారంభించారు. వైఎస్ ను ఎలా పొగిడితే దగ్గరవ్వొచ్చో బాగా తెలుసుకుని అలా పొగిడేవారు. చివరికి తన భార్యతో వైఎస్ పథకాలతో పీహెచ్డీ చేయించేశారు. దాన్ని విస్తృతంగా ప్రచారం చేయించుకున్నారు. ఇక ఆయనకు ఎదురులేకుండా పోయింది. చిన్న చిన్నపదవులే అయినా నిరాశపడకుండా తీసుకుని పెద్ద పెద్ద సంపాదనలు చేసుకున్నారు. వందల కోట్ల ఆస్తి పరుడయ్యారని చెబుతారు.
చెవిరెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్ సహా అనేకానేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన స్టైల్ అధికారుల్ని బెదిరించడం. చంద్రగిరిలో అయినా.. ఇంకోచోట అయినా ఆయన తీరు అంతే. అధికారంలో ఉంటే బెదిరించాల్సిన పని ఉండదు. తన పనులు తన స్టైల్లో చక్కబెట్టేసుకుంటారు. ఆయన తీరుతో.. జగన్ రెడ్డిని కూడా మెప్పించారు. అందుకే జగన్ రెడ్డి కోటరీలో చేరిపోయారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కంటే ఇప్పుడు చెవిరెడ్డినే జగన్ రెడ్డికి ఎక్కువ ఆత్మీయుడు. కోటరీలో కీలక వ్యక్తి కూడా. నగదును ఎలా తరలించాలో చెవిరెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెప్పుకుంటారు. తన వద్ద గన్ మెన్లుగా .. ఇతర విధుల్లో పని చేసే పోలీసుల్ని వాడుకుని ఆయన పనులు పూర్తి చేస్తారు.
ఇక్కడ చెవిరెడ్డిది ప్రత్యేకమైన శైలి. ఆయా పోలీసులకు తగిన ప్రతిఫలం అందిస్తారు. లైఫ్ సెటిల్మెంట్ ఉంటుందని భరోసా ఇస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగాన్ని నమ్ముకోవడం కన్నా చెవిరెడ్డిని నమ్ముకోవడం మంచిదని అనుకుంటూ ఉంటారు. మదన్ రెడ్డి అనే గన్ మెన్తో ఆయన ఆడిస్తున్న నాటకం దీనికి పరాకాష్ట. ఇప్పుడు ఆయన కూడా అడ్డంగా దొరికిపోయారు. వెంకటేష్ నాయుడు అనే బినామీని తీసుకుని దేశం దాటిపోవాలని అనుకున్నారు. కానీ దొరికిపోయారు. ఇప్పుడు అసలు కథ ప్రారంభం కానుంది.
చెవిరెడ్డి చిల్లర డ్రామాలతో సిట్ పై ఆరోపణలు చేయించి.. ఏదో సాధించవచ్చని అనుకుంటున్నారు. కానీ పోలీసులపైనే కుట్రలు చేస్తే .. వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో వారు చూపిస్తారు. ఇప్పుడు అదే జరగబోతోంది. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి చేసిన దోపిడీలో జగన్ రెడ్డికి ఆయన ఇచ్చిన రోల్ బయటపడింది. ఇక ఎలాంటి డ్రామాలు వర్కవుట్ అయ్యే అవకాశం ఉండదు.