జగన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనకు చేసిన షోలో రెండు ప్రాణాలు పోయాయి. అయితే ఇప్పటికీ ఏమీ తెలియనట్లుగానే ఉన్నారు. అసలు ఘోరమైన విషయం ఏమిటంటే అందులో ఒకరు జగన్ రెడ్డి కారు కిందనే పడి చనిపోయారు. ఆ ఒకరు వైసీపీ కార్యకర్త, దళితుడు అని చీలి లింగయ్య. గుంటూరు అంకిరెడ్డిపాలెనికి చెందిన ఆయన జగన్ వీరాభిమాని. వైసీపీ నేతలు జగన్ పర్యటనపై విస్తృతంగా ప్రచారం చేయడంతో చూసేందుకు ఏటుకూరు రోడ్ వైపు వెళ్లారు. అక్కడ ఆయన వాదన దగ్గరకు వెళ్లడంతో కొంత మంది తోసేశారు. కిందపడిపోయిన ఆయనపై జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఎక్కేసింది.
ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటన జరిగినప్పుడు.. ఆ వృద్ధుడ్నిలాగి.. రోడ్ డివైడర్లో పడేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. జగన్ కాన్వాయ్ వాహనం కాదని… వేరే వాహనం ఢీకొన్నదని సమాచారం పై స్థాయి అధికారులకు పంపించారు. గుంటూరు ఎస్పీ కూడా అదే అనుకుని ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ నిజం మాత్రం వీడియోల రూపంలో వెలుగులోకి వచ్చారు. తాను ప్రయాణిస్తున్న కారు మనిషి మీదకు ఎక్కిందని తెలియనంత అమాయకుడేం జగన్ కాదు. ఆయన చూశాడు. అయినా సరే పిలిపించుకున్న కార్యకర్తలతో జేజేలు పలికించుకుంటూ వెళ్లిపోయారు.
పర్యటన మొత్తంలో ఎక్కడా ఆయనలో తన కారు కిందపడి ఓ వృద్ధుడు చనిపోయాడన్న చిన్న విషాదం కూడా కనిపించలేదు. తన కాన్వాయ్ కారు ముందు కారుకు వేలాడబడుతూ వచ్చిన ఓ వ్యక్తి చనిపోయినా అదే తీరు. ఇద్దరు సొంత కార్యకర్తల ప్రాణాలు పోవడానికి కారణం అయిన జగన్ రెడ్డి అంత నింపాదిగా ఎలా ఉండగలిగాడో చాలా మందికి అర్థం కావడం లేదు. ఆయన మనస్థత్వం గురించి ఆలోచిస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇంత దారుణంగా ఓ నాయకుడు ఉండగలడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.