కాళేశ్వరం బ్యారేజీ పగుళ్లను కేటీఆర్ చాలా చిన్న సమస్యగా చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. ఔనా.. నిజమా అని నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా కేటీఆర్ ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఓ రైల్వే ట్రాప్ ఫ్లైఓవర్ లాంటిది కట్టారు. అయితే అది ఇంజినీరింగ్ లోపాలతో ఉంది. ఫుట్ పాత్ కట్టినట్లుగా.. ఓ చోట ఎల్ షేపులో టర్నింగ్ ఇచ్చేశారు. అది వాహనాలు తిరగడానికి పనికి రాదని పలువురు ట్రోల్ చేస్తూ వస్తున్నారు. దాంతో పాటు బీహార్ లో నిర్మించిన ఓ క్లాక్ టవర్ కాస్త విచిత్రంగా ఉంది. ఆ ఫోటోలను పోస్టు చేసి.. కాళేశ్వరంతో పోల్చుకున్నారు.
గతంలో ఓ ఎయిర్ పోర్టు భారీ వర్షం వచ్చినప్పుడు బయట పైకప్పు కూలింది. ఆ దృశ్యాలను .. రీట్వీట్ చేసి.. డబుల్ ఇంజిన్ సర్కార్ లో రెండు ఇంజినీరింగ్ మార్వెల్స్ అని సెటైర్లు వేశారు. ఇలాంటి వాళ్లు తెలంగాణలో అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో మైనర్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది చాలా సిగ్గు చేటన్నారు.
కాళేశ్వరం సమస్యను చాలా చిన్నది చెప్పడానికి కేటీఆర్ ఎంత తాపత్రయ పడుతున్నారో ఈ ట్వీట్ ద్వారా సులువుగానే అర్థమవుతుంది. ఓ చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చాలు.. ఆ చిన్న గీతది చిన్న తప్పే అవుతుందన్న కాన్సెప్ట్ అమలు చేస్తున్నారు. కానీ కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు. ఆ ఫ్లైఓవర్ ఖర్చు కనీసం వంద కోట్లు కూడా ఉండదు. పైగా అది కూలిపోలేదు.. ఇంజినీరింగ్ తప్పిదం జరిగింది. కానీ ఇక్కడ పిల్లర్లకు క్రాసులు వచ్చాయి. పనికి రాదని నిపుణులు తేల్చారు. అయినా ఆ సమస్య పక్కన.. చిన్న చిన్న సిల్లీ విషయాలతో పెద్ద గీతలు గీసి చిన్నది చేయాలని చూస్తున్నారు. కానీ కాళేశ్వరం అనే గీత పక్కన పెద్దది గీత గీసి దాన్ని చిన్నది చేయాలంటే… దాదాపుగా అసాధ్యమే అనుకోవచ్చు.