వైసీపీ రాజకీయాలు ఎలా ఉంటాయో స్థానిక ఎన్నికలపై చేస్తున్న ప్రచారమే ఉదాహరణ. ఇద్దరి కంటే ఎక్కవ మంది పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నట్లుగా .. దానికి తగ్గట్లుగా ఉత్తర్వులు ఇచ్చేసినట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారం పరాకాష్టకు చేరింది. పిల్లల పేర్లతో లెటర్స్ రాస్తున్నట్లు వాట్సాప్ లో కథలు ఫార్వార్డ్ చేస్తున్నారు.
చంద్రబాబునాయుడు జనాబా పెంపు దల గురించి మాట్లాడినప్పుడల్లా.. గతంలో ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉన్న వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ రూల్ ఎత్తేశాం. జనాభా ఇంకా తగ్గిపోతే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లు ఉంటేనే పోటీకి అర్హులు అనే నిబంధన పెట్టాల్సి వస్తుందని చెబుతూ వస్తున్నారు. అంతే కాని పెట్టామని.. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలనే రూల్ ఉంటుందని చెప్పలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం దీన్ని ప్రచారం చేసేస్తోంది.
జనాభా తగ్గిపోతోందని దాని వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కోల్పోతున్నాయని అందరూ అంటున్నారు. అదే విషయాన్ని చంద్రబాబు చెబుతున్నారు. అందుకే పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ప్రసూతి సెలవులు ఎన్ని కాన్పులకైనా ఇస్తామని రూల్స్ మార్చారు. ఎంత మది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తున్నారు. చంద్రబాబు మాటల్ని వక్రీకరించి ప్రచారం చేసి.. అదే రాజకీయం అని వైసీపీ నేతలు సంతృప్తి చెందుతున్నారు.