కాల్-డాటా ఇచ్చారు సరే, చూడనీకపోతే ఏమి ప్రయోజనం?

ఐడియా, వోడా ఫోన్, ఎయిర్ టెల్, డొకోమో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇవ్వాళ్ళ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి మరో 25 ఫోన్ నెంబర్ల తాలూకు కాల్-డాటాని సీల్డ్ కవర్లో అందించారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు 29 నెంబర్ల సంబంధించిన కాల్-డాటాని సీల్డ్ కవర్లో కోర్టుకి అందించారు. హైకోర్టు ఆదేశానుసారం రెండుసార్లు కూడా ఆ సీల్డ్ కవర్లను ప్రత్యేక దూత ద్వారా తిరిగి హైకోర్టుకి పంపించబడ్డాయి. సుప్రీం కోర్టు ఆ వివరాలను విజయవాడ కోర్టుకి ఇచ్చేందుకు సర్వీస్ ప్రొవైడర్లను అనుమతించింది. కానీ తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీం ఆదేశాలను మన్నిస్తూ ఆ వివరాలను విజయవాడ కోర్టుకి సీల్డ్ కవర్లో పంపించడం తిరుగు టపాలో మళ్ళీ దానిని హైకోర్టుకి త్రిప్పి పంపిస్తుండటం జరుగుతోంది.

కాల్-డాటా వివరాలను తెరిచి చూసేందుకు అనుమతించనప్పుడు ఇదొక ప్రహసనంగా మిగులుతుందే తప్ప ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నటికీ తన ఆరోపణలను నిరూపించలేదు. ఒకవేళ ఊహించని విధంగా ఓటుకి నోటు కేసులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణా ప్రభుత్వం నోటీసులు పంపిస్తే అప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మరెవరికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు పంపించలేదు. ఎందుకంటే తన ఆరోపణలను రుజువు చేసే వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. అవన్నీ హైకోర్టులో భద్రపరచబడ్డాయి. అవి తెరిచి చూడాలనుకొంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అనుమతి అవసరం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న విజయవాడ కోర్టు అడిగినా ఆ వివరాలను కోర్టుకి చూపించలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ వివరాలు సంపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈకేసును వచ్చేనెల 10కి విజయవాడ కోర్టు వాయిదా వేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close