ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. విభజన తర్వాత కొత్త రాష్ట్రంలో చంద్రబాబు మొదటి టర్మ్ లో ఈ మాట ఎక్కువగా వినిపించేది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ లో ఏపీ ఏప్పుడూ ముందు ఉండేది. కానీ ఇప్పుడు నారా లోకేష్ ఈజ్ నుంచి స్పీడ్కు పాలసీ మార్చేశారు. ఈజ్ ఎలాగూ ఉంటుంది దానికి స్పీడ్ తోడు కావాలని పాలసీ మార్చేసి పరుగులు పెడుతున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఉంటే అక్కడకు వెళ్తున్నారు. ఇది పారిశ్రామికవర్గాల్లో లోకేష్కు ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకు వచ్చింది. ఉన్న పళంగా తమ పెట్టుబడులు గ్రౌండ్ చేయాలంటే.. లోకేష్కు ఒక్క రింగ్ ఇస్తే చాలన్నట్లుగా పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. ఏపీకి గత ఇమేజ్ ను మార్చేసి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఇమేజ్ తీసుకు వచ్చేసింది.
లక్ష్యాన్ని పెంచుకున్న నారా లోకేష్
నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు తన టార్గెట్ ఇరవై లక్షల ఉద్యోగాలు అనుకున్నారు. అందు కోసం పెట్టుబడులు సాధించడానికి మొదటి రోజు నుంచే స్పీడ్ పెంచారు. ఇప్పుడు ఆయన ప్రయత్నాలు ఫలించాయి. అందుకే తన లక్ష్యాన్ని పెంచుకున్నారు. 5 సంవత్సరాల్లో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. ” ఇప్పటికే 17 నెలల్లో 120 బిలియన్ డాలర్లు ఆకర్షించాం. నేను ‘ ఆకలి’గా ఉన్నాను—1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాకే విశ్రమిస్తాను” అని జాతీయ బిజినెస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో నారా లోకేష్ ఖరాఖండిగా చెబుతున్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే ఇప్పుడు కాన్సెప్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డొయింగ్ బిజినెస్’ (SoDB) మోడల్పై ఆధారపడి ఉంది. “ఈజ్ ఆఫ్ డొయింగ్ బిజినెస్ కాకుండా, స్పీడ్పై ఫోకస్ చేస్తున్నామని లోకేష్ చెబుతున్నారు. ఒక నెల ఆలస్యం కూడా పెట్టుబడుల ప్లాన్ను మార్చేస్తుందని.. అందుకే తాము ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నామన్నారు. CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో 410 MoUలు, 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాన్ని 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో ఈ పెట్టుబడులు కీలకమని లోకేష్ బావిస్తున్నారు.
వ్యవసాయ అధారిత రాష్ట్రాన్ని.. పారిశ్రామిక రాష్ట్రంగా మార్చడమే టార్గెట్
2014లో విభజన తర్వాత ఏపీ పారిశ్రామికంగా వెనుకబడింది. మొదటి ఐదేళ్లు పరిశ్రమల్ని ఆకర్షించినా తర్వాత ఐదేళ్లు ఘోరమైన అనుభవాలు పారిశ్రామికేత్తలకు ఎదురయ్యాయి. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, 17 నెలల్లో 120 బిలియన్ డాలర్ల ఫర్మ్ కమిట్మెంట్లు లభించాయి. గూగుల్ 15 బిలియన్ డాలర్ల AI హబ్ & డేటా సెంటర్, అర్సెలార్మిటాల్ 1.4 ట్రిలియన్ రూపాయల గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, BPCL 1 లక్ష కోట్ల రిఫైనరీ, NTPC 1.65 లక్ష కోట్ల గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి మెగా ప్రాజెక్టులు ఏపీ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చనున్నాయి.
ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు
పెట్టుబడులను వేగంగా గ్రౌండ్లోకి తీసుకువచ్చే పాలసీలు తెచ్చారు. ల్యాండ్ అలాట్మెంట్ను 6 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ వరకు అందరూ ఈ ‘స్పీడ్’ భాష మాట్లాడుతున్నారు, ఇది రాష్ట్ర సంస్కృతిగా మారింది. “పెట్టుబడిదారులు వస్తే, ప్రాజెక్ట్ వారిది కాదు మాది—మేము దాన్ని ఓన్ చేసుకుంటాం” అనే పాలసీకి లోకేష్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రాల మధ్య పోటీ వల్ల భారత్ గెలుస్తుందని లోకేష్ భావన. అందుకే పోటీ పడతామని అందులో .. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. పోటీ పడి ఇన్సెంటివ్స్ ప్రకటించడం అనేది.. పాలసీనేనని లోకేష్ భావన. ఓ ఎకోసిస్టమ్ ఉన్న చోట..పెట్టుబడులకు పెద్దగా రాయితీలు అక్కర్లేదు. కానీా ఓ కొత్త ప్రాంతానికి అయితే ఆకర్షించాల్సిందే. అందుకే లోకేష్.. తనదైన సూపర్ విజన్ తో ముందుకు సాగుతున్నారు. లోకేష్ లక్ష్యం పూర్తి పాజిటివ్ వేలో సాగుతోంది. ఐదేళ్లలో ఏపీ పారిశ్రామిక రంగం ముఖచిత్రం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.
