చీప్ లిక్కర్‌పై దిగొచ్చిన కేసీఆర్

హైదరాబాద్: చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు, కల్లుగీత కార్మికులనుంచి ముప్పేటదాడి ఎదురవటంతో కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పద్మారావు ఇవాళ చెప్పారు. గుడుంబా మహమ్మారినుంచి రక్షించాలనే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని అనుకున్నామని తెలిపారు. చీప్ లిక్కర్‌పై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని అన్నారు. గుడుంబా నియంత్రణకు ఒక తేదీ ప్రకటిస్తామని చెప్పారు. ఆ తర్వాత గుడుంబా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గౌడకులస్తులు చీప్ లిక్కర్ వలన నష్టపోతారన్న విపక్షాల వాదన సరైనది కాదన్నారు. ఉద్యమాలు చేసేవాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. గుడుంబాను అరికట్టాలన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. గుడుంబావల్ల ఎంతోమంది చనిపోతున్నారని అన్నారు. కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మే స్థాయికి దిగలేదని పద్మారావు చెప్పారు. ఒక కేసు చీప్ లిక్కర్‌పై ప్రభుత్వానికి రు.1,800 ట్యాక్స్ వస్తుందని, దానిని రు.700కు తగ్గించుకుని నాణ్యమైన లిక్కర్‌ను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజల ఆయుష్షును పెంచటానికే సీఎమ్ నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. చీప్ లిక్కర్‌ను కొత్తగా తయారుచేయటంలేదన్నారు. చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడైతే ప్రభుత్వానికి అంత నష్టమని చెప్పారు. ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకముందే ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close