ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: వెంకయ్య

ప్రత్యేక హోదా అంశంపై అందరి కంటే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడేనని అందరికీ తెలుసు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చాలా సార్లు రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని హామీలు ఇచ్చారు. కానీ, ఆ తరువాత అది సాధ్యం కాదన్నట్లు మాట్లాడి ప్రజలు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు మూటగట్టుకొన్నారు. ఆ కారణంగా ఆయన చాలా రోజులుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మానుకొన్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయిన తరువాత నుండి మళ్ళీ దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.

నెల్లూరులో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా హామీపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. విభజన చట్టంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను, ప్రత్యేక ప్యాకేజి, హోదా మంజూరు చేయడం కోసం అధ్యయనం చేసి వీలయినంత త్వరలో నివేదిక సమర్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ ని కోరినట్లు తెలిపారు. తను కూడా స్వయంగా నీతి అయోగ్ అధికారులతో సమావేశమయ్యి రాష్ట్రానికి ఆదుకొనే విధంగా వీలయినంత త్వరగా నివేదికను తయారు చేయమని కోరినట్లు తెలిపారు. అంటే ప్రత్యేక హోదా వస్తుందని ఆయన మళ్ళీ హామీ ఇస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయిన తరువాత ఇక ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు…కనుక ప్రత్యేక ప్యాకేజీతో సర్దుకుపోకతప్పదు అన్నట్లుగా మాట్లాడారు. అంతే కాదు ప్రత్యేక హోదా కంటే ఆర్ధిక ప్యాకేజీ వలననే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వాదించారు. రూ.2.25 లక్షల కోట్ల ప్యాకేజి కోసం కేంద్రానికి అభ్యర్ధన, ప్రతిపాదనలు కూడా అందజేశారు. మరి అటువంటప్పుడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మళ్ళీ ప్రత్యేక హోదాపై వెనక్కు తగ్గలేదని చెప్పడానికి అర్ధం ఏమిటో ? కానీ ఈ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎంత కాలం నాన్చితే దాని వలన వారికే అంత నష్టం జరిగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close