తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు 23 నుండి

ఈ నెల 7వ తేదీ నుండి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీపర్యటనకు బయలుదేరుతున్నందున, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఆయన పర్యటనకు బయలుదేరేలోగా అంటే ఈ నెల మొదటి వారంలోనే నిర్వహించాలని మొదట భావించినప్పటికీ హడావుడిగా సమావేశాలు నిర్వహించి ‘మమ’ అనిపించేయడం కంటే ఆయన తిరిగి వచ్చిన తరువాతనే నిర్వహించాలని నిశ్చయించుకొన్నారు. అదే విషయం ఆయన నిన్న మీడియాకి తెలియజేస్తూ “నేను విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత సెప్టెంబర్ 23నుండి ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరుకొంటే అన్ని రోజులు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాము,” అని అన్నారు.

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కనీసం 15రోజుల పాటు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా కోరినప్పటికీ కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహిస్తుంటే, కేసీఆర్ ప్రతిపక్షాలు అడగక ముందే వాళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని చెప్పడం విశేషం. కానీ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న తీరు చూస్తుంటే ఆ ఐదు రోజులు కూడా ఎక్కువేనెమోననే భావన కలుగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రజా సమస్యలపై చర్చ మొదలుపెట్టి, ఆ తరువాత వాటిపై చర్చను పక్కనపెట్టి ఒకరినొకరు దూషించుకోవడానికి, విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడానికే పరిమితమవుతున్నారు. ఆ మాత్రం దానికి విలువయిన ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం దేనికని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇదే విధంగా సాగినప్పటికీ, సమావేశాలు మొదలవగానే ఏదో కారణంతో తెదేపా సభ్యులు గొడవ చేయడం ఆ సాకుతో వారందరినీ సభ నుండి సమావేశాలు జరిగినంత కాలం సస్పెండ్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. సభలో మిగిలిన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తెరాస ప్రభుత్వానికి సహకరిస్తూ చర్చల్లో పాల్గొంటున్నారు కనుక సమావేశాలు సజావుగా సాగిపోతున్నాయి. పైగా సభలో కాంగ్రెస్ ఫ్లోర్-లీడర్ కె.జానారెడ్డి తెరాస పట్ల చాలా మెతక వైఖరి అవలంభిస్తుండటంతో సభలో ప్రతిపక్షం అసలు ఉందా లేదా? అన్నట్లు చాలా సజావుగా సాగిపోతుంటుంది. కానీ ప్రజలు కోరుకొనేది కూడా అదే. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏవిధమయిన రాజకీయ విభేదాలున్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలలో వాటన్నిటినీ పక్కనబెట్టి ప్రజా సమస్యలపై లోతుగా చర్చించి, వాటికి పరిష్కారాలు కనుగొనాలని ఆశిస్తారు. ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు సమ ఉజ్జీలుగా ఉండటంతో అది సాధ్యం పడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close